పంబోతులారా ఆంబోతులారా
అడిగోనయ్యా ఆదిమహాశివయ్య
ముంగాలు మడవండి దండాలు పెట్టండి
బంగారునగలెంత బుసనాగు మణిచెంతఁ
సింగారమీ కెంపు సీమేను నెత్తురు
పొంగారుఁ మా ఱేటి మహిమ నేలంతఁ
పంబోతులారా ఆంబోతులారా
అడిగోనయ్యా ఆదిమహాశివయ్య
పోతులన్నిటికన్న నీడి పోతే మిన్న
తెల్లనీ గంగడోలు తళతళా మెఱిసేను
తోకసప్పిటితోన దులిపేను దిక్కుల్ని
సూది కొమ్ములతోన సంపేను కామణ్ణి
పంబోతులారా ఆంబోతులారా
అడిగోనయ్యా ఆదిమహాశివయ్య
అమ్మోరి వాకిటా ఆగేడు సూడండి
బెమ్మోడి పుఱ్ఱెనే సాసేడు సూడండి
కమ్మనీ పెరుగన్న మేసింది మాయమ్మ
గుమ్మనే మారేడు పువ్వోటి నావంతు
పంబోతులారా ఆంబోతులారా
అడిగోనయ్యా ఆదిమహాశివయ్య
భాషందం, భువనందం, బ్రతుకందం
Tuesday, January 25, 2011
Saturday, January 01, 2011
పోయిన బాల్యపు చెరిగిన పదముల చిహ్నాల కోసం
ఆశ. విద్యలేనివాఁడు వింత పశువు అన్నారు గాని, ఆశ లేని వాడిని గుఱించి ఏమీ చెప్పలేదు.
బుద్ధినాశాత్ ప్రనశ్యతి అన్నారు గాని, ఆశనాశాత్ కిం నశ్యతి అన్నదీ చెప్పలేదు.
చిన్నప్పుడు గుర్తుందా, ఏమీలేకపోయినా ఆశ వుండేది.
వెనకఁబడిన దేశమైనా, దిక్కుమాలిన విద్యావ్యవస్థ అయినా, హక్కులు లేని పిల్లలైనా, డబ్బు దైవమని నమ్మింపజేసినా, పరాయివారు పాలించి దోచుకున్నారని చెప్పినా, స్వపాలకులు సైతం దోచుకున్నారని చెప్పినా, ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా, ఆశ వుండేది.
"తరలిరాద తనే వసంతం తనదరికి రాని వనాల కోసం" అన్నంత ఆశ వుండేది.
వానాకాలపు వరదలకుకొట్టుకుపోయిన చెఱువు గట్టు మీద అప్పుడే తాత్కాలికంగా వేసిన ఇసుకబస్తాల ప్రక్కననుండి జాగ్రత్తగా బడికి బయలుదేరి మెటడారులో వెళుతుంటే, డ్రైవరు చిన్నబ్బాయికి దక్కిన ఒకే ఒక్క పాటల క్యాసెట్టు గీతాంజలి వేయవసారి మ్రోగిస్తుంటే, ఇళయరాజా సంగీతానికి వేటూరి పాటకు బాలు గొంతు తోడుగా పంపి, ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈవేళ అని వినిపిస్తుంటే, బళ్ళో లెక్కలపంతులు భయము, ఇంట్లో పెద్దవాళ్ల బుద్ధిచెప్పుళ్ళూ, అన్నీ మాయమయ్యి, ఒక నాడు మనమూ ఒక జీపుని ఒక మంచుతాకే మట్టిరోడ్డు ప్రక్కన నిలిపి అడవిలో పాటలు పాడుకుంటూ వెళ్ళవచ్చునేమోననుకునేవారం. పంతుళ్ళ బెత్తాలనుండి, పెద్దాళ్ళ నీతిబోధలనుండి దూరంగా పోవచ్చనుకునేవారం. లేకపోతే వర్షంలో గొడుగు ప్రక్కనపాడవేసి పచ్చటి దిబ్బల మీద వళ్ళంత త్రుళ్ళేట్టు ఆడవచ్చని అనుకునైవారం గుర్తుకువుందా.
ఋతువుల రాణి వసంతకాలం మంత్రకవాటం తెరచుకునీ,
కంచు వృషభముల అగ్నిశ్వాసం క్రక్కే గ్రీష్మం కదలాడీ,
ఏళ్లు, బయళ్లూ, వూళ్లూ, బీళ్లూ ఏకంచేసే వర్షాకాలం,
స్వచ్ఛ కౌముదుల శరన్నిశీథినులు,హిమానీ నిబిడ హేమంతములు,చలివడకించే శైశిరకాలం
వస్తూ పోతూ దాగుడుమూతల క్రీడలాడుతవి మీ నిమత్తమే!
ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇనబింబం పయనించు నింగిపై!
ఎప్పుడు కూడా ఇవాళలాగే గాలులు వీచును, పూవులు పూచును!
నాకు కనంబడు నానాతారక,లనేక వర్ణా, లనంత రోచులు దిక్కు దిక్కులా దివ్యగీతములు మీరూ వాటికి వారసులే!
అని శ్రీశ్రీ అంటే అర్థంకాకపోయినా తలనడ్డంగా ఊపేవారిమే!
ఎన్ని పచ్చి అబద్దాలు !!! సుందరయ్య సచ్చివూరుకున్నాడుగాని లేకపోతే బోనులో నిలదీసేవాడినే! చేతదక్కితే మణిరత్నం కెమెరాని వెయ్యముక్కలు చేసేవాడినే!
ఏదో ఒక చోటుని ఆ వేటురి పాటగా ఊహించుకొని,
పరుగుపెట్టి అక్కడకు వెళ్ళి, అదింకా దూరంగా జరుగుతుంటే,
ఎండమావిలాగ దానిని వేటాడి వేటాడి అలసిపోయి
ఎడారిలో పడివున్ననాడు, అప్పటివఱకూ అభివృద్ధి చెందిన జ్ఞానం
నడినత్తిన పొద్దు మల్లే వళ్ళు కాల్చివేస్తుంటే,
తెలుసుకొన్న ఒక్కొక్క విషయం,
చిల్లరగాలిలా ఒక్కొక్క ఆశని ఆర్పేస్తుంటే.
వైరాగ్యపు ఇసుకతిన్నెలు అన్నిదిక్కులూ మూసివేస్తే,
బ్రతికివుండడానికి ప్రతినాడూ బ్రతికివుండడమే గొప్పయని గుర్తుచేసుకుంటూ,
గంటకోగుదిబండ దింపినట్లు నెట్టుకువస్తుంటే,
ఏమైపోయింది ఆ అమాయకత్వం, ఎవర్రెత్తుకెళ్ళిపోయారు.
ఎవడా బేహారి గులాబీలు తీసుకొని గుచ్చుకొనే ముళ్ళు ఇచ్చిపోయినాడు.
చంపినవాడికే బ్రతుకు ద్రక్కుతుందని తెలుకొని బ్రతకగడమా,
తిండి పెట్టే తోటలకై నేలకొఱిగిన చెట్లలో పిట్టల గోల వినపడుతుంటే తినగలమా,
జగాలకు పాలుపోసి పెంచిన తల్లిమెడలో పుఱ్ఱెలు చూసినవాడికి పాలమీద ఆశవుంటుందా
పిల్లల పాలకోసమై రక్తం త్రాగే కాళిక జుట్టు పట్టుకొని వేళ్ళాడుతూ ఈ జీవుఁడు
జారిపోయి మృత్యువను అఖాతంలోనికి పడి మాయమైపోతాడనే భయంతో పట్టు బిగించి,
వెఱ్ఱిది విలయతాండవం చేస్తుంటే,
పైగసి కొంత సేపు, పైనున్నానని భ్రమించి మురిసి,
క్రిందికి జారి కొంతసేపు క్రిందనున్నాని ఏడిచి,
ఇటు ప్రక్కకూగి అటు ప్రక్కకూగి ఇంకా గట్టిగా పట్టుకొని,
ఇంతా చేసి ఆఖరుకి వయస్సు మళ్ళినపుడు, పట్టుసడలుతుందని తెలిసినా బుద్ధిరాదే,
పుఱ్ఱెలు కాళిక కాళ్ళక్రింద పఠ్ఠు పఠ్ఠు మని ప్రేలుతున్నా ఆ చప్పుటికి మేలుకువరాదే.
మాయమోహించి ముట్టుకుంటే బూడిదచేస్తుందని ఎఱుఁగకా,
తానైన ఈ మిథ్యాజగత్తులో తన మగని ఉనికి నిలుపుటకోసమై
ఎంతవారలనైనా కాంతదాసులని చేస్తుందని ఎఱుఁగకా,
కూడు దొరకక మనివేస్తే కడుపులో మంటై మండుతుందే,
ఆశ తీఱక అలసిపోయినపుడు మదిలో క్రోధమై రగులుతుందే,
కష్టపడి కూడు పోసిన వాడిని కొన్ని గడియలకు మరలా కాల్చనుందే,
ఎంతటెంతటికోనోర్చి ఆశ దీర్చిన వాడిని ఇంకా పెను యాశయై తోసిందే,
సత్తువున్న వాడిచేత నీరసుణ్ణి సంపించిందే, వాడి మాంసాని కూటిగా వీడికి పెట్టిందే,
ఇన్నీ చూసినా ఎంత చెప్పినా ఇంకా దాని వెంటే పోయిందే వెఱ్ఱి దేహము.
వైరాగ్యమను వికారముతో తిండి నప్పనినాడు
బండలని మ్రోసిమ్రోసి వీపు బ్రద్దలైననాడు
మాయలోఁబడి ఏది కానుకో ఏది కత్తివేటో తెలియనినాడు
బట్టకూడా పెట్టక కాడులమ్మట త్రిప్పే తన తిక్కమగని
ఈ ప్రక్కకు పంపుతుందని నమ్మి ఆగేదా
లేదా
ఏలాగూ వాడు గుడిసె వేసి కాసే కాటికేగా
కడకు పోయేదని తెలిసి అందాకా ఓర్చేదా?
అంకితం- ప.నా.రా
బుద్ధినాశాత్ ప్రనశ్యతి అన్నారు గాని, ఆశనాశాత్ కిం నశ్యతి అన్నదీ చెప్పలేదు.
చిన్నప్పుడు గుర్తుందా, ఏమీలేకపోయినా ఆశ వుండేది.
వెనకఁబడిన దేశమైనా, దిక్కుమాలిన విద్యావ్యవస్థ అయినా, హక్కులు లేని పిల్లలైనా, డబ్బు దైవమని నమ్మింపజేసినా, పరాయివారు పాలించి దోచుకున్నారని చెప్పినా, స్వపాలకులు సైతం దోచుకున్నారని చెప్పినా, ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా, ఆశ వుండేది.
"తరలిరాద తనే వసంతం తనదరికి రాని వనాల కోసం" అన్నంత ఆశ వుండేది.
వానాకాలపు వరదలకుకొట్టుకుపోయిన చెఱువు గట్టు మీద అప్పుడే తాత్కాలికంగా వేసిన ఇసుకబస్తాల ప్రక్కననుండి జాగ్రత్తగా బడికి బయలుదేరి మెటడారులో వెళుతుంటే, డ్రైవరు చిన్నబ్బాయికి దక్కిన ఒకే ఒక్క పాటల క్యాసెట్టు గీతాంజలి వేయవసారి మ్రోగిస్తుంటే, ఇళయరాజా సంగీతానికి వేటూరి పాటకు బాలు గొంతు తోడుగా పంపి, ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈవేళ అని వినిపిస్తుంటే, బళ్ళో లెక్కలపంతులు భయము, ఇంట్లో పెద్దవాళ్ల బుద్ధిచెప్పుళ్ళూ, అన్నీ మాయమయ్యి, ఒక నాడు మనమూ ఒక జీపుని ఒక మంచుతాకే మట్టిరోడ్డు ప్రక్కన నిలిపి అడవిలో పాటలు పాడుకుంటూ వెళ్ళవచ్చునేమోననుకునేవారం. పంతుళ్ళ బెత్తాలనుండి, పెద్దాళ్ళ నీతిబోధలనుండి దూరంగా పోవచ్చనుకునేవారం. లేకపోతే వర్షంలో గొడుగు ప్రక్కనపాడవేసి పచ్చటి దిబ్బల మీద వళ్ళంత త్రుళ్ళేట్టు ఆడవచ్చని అనుకునైవారం గుర్తుకువుందా.
ఋతువుల రాణి వసంతకాలం మంత్రకవాటం తెరచుకునీ,
కంచు వృషభముల అగ్నిశ్వాసం క్రక్కే గ్రీష్మం కదలాడీ,
ఏళ్లు, బయళ్లూ, వూళ్లూ, బీళ్లూ ఏకంచేసే వర్షాకాలం,
స్వచ్ఛ కౌముదుల శరన్నిశీథినులు,హిమానీ నిబిడ హేమంతములు,చలివడకించే శైశిరకాలం
వస్తూ పోతూ దాగుడుమూతల క్రీడలాడుతవి మీ నిమత్తమే!
ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇనబింబం పయనించు నింగిపై!
ఎప్పుడు కూడా ఇవాళలాగే గాలులు వీచును, పూవులు పూచును!
నాకు కనంబడు నానాతారక,లనేక వర్ణా, లనంత రోచులు దిక్కు దిక్కులా దివ్యగీతములు మీరూ వాటికి వారసులే!
అని శ్రీశ్రీ అంటే అర్థంకాకపోయినా తలనడ్డంగా ఊపేవారిమే!
ఎన్ని పచ్చి అబద్దాలు !!! సుందరయ్య సచ్చివూరుకున్నాడుగాని లేకపోతే బోనులో నిలదీసేవాడినే! చేతదక్కితే మణిరత్నం కెమెరాని వెయ్యముక్కలు చేసేవాడినే!
ఏదో ఒక చోటుని ఆ వేటురి పాటగా ఊహించుకొని,
పరుగుపెట్టి అక్కడకు వెళ్ళి, అదింకా దూరంగా జరుగుతుంటే,
ఎండమావిలాగ దానిని వేటాడి వేటాడి అలసిపోయి
ఎడారిలో పడివున్ననాడు, అప్పటివఱకూ అభివృద్ధి చెందిన జ్ఞానం
నడినత్తిన పొద్దు మల్లే వళ్ళు కాల్చివేస్తుంటే,
తెలుసుకొన్న ఒక్కొక్క విషయం,
చిల్లరగాలిలా ఒక్కొక్క ఆశని ఆర్పేస్తుంటే.
వైరాగ్యపు ఇసుకతిన్నెలు అన్నిదిక్కులూ మూసివేస్తే,
బ్రతికివుండడానికి ప్రతినాడూ బ్రతికివుండడమే గొప్పయని గుర్తుచేసుకుంటూ,
గంటకోగుదిబండ దింపినట్లు నెట్టుకువస్తుంటే,
ఏమైపోయింది ఆ అమాయకత్వం, ఎవర్రెత్తుకెళ్ళిపోయారు.
ఎవడా బేహారి గులాబీలు తీసుకొని గుచ్చుకొనే ముళ్ళు ఇచ్చిపోయినాడు.
చంపినవాడికే బ్రతుకు ద్రక్కుతుందని తెలుకొని బ్రతకగడమా,
తిండి పెట్టే తోటలకై నేలకొఱిగిన చెట్లలో పిట్టల గోల వినపడుతుంటే తినగలమా,
జగాలకు పాలుపోసి పెంచిన తల్లిమెడలో పుఱ్ఱెలు చూసినవాడికి పాలమీద ఆశవుంటుందా
పిల్లల పాలకోసమై రక్తం త్రాగే కాళిక జుట్టు పట్టుకొని వేళ్ళాడుతూ ఈ జీవుఁడు
జారిపోయి మృత్యువను అఖాతంలోనికి పడి మాయమైపోతాడనే భయంతో పట్టు బిగించి,
వెఱ్ఱిది విలయతాండవం చేస్తుంటే,
పైగసి కొంత సేపు, పైనున్నానని భ్రమించి మురిసి,
క్రిందికి జారి కొంతసేపు క్రిందనున్నాని ఏడిచి,
ఇటు ప్రక్కకూగి అటు ప్రక్కకూగి ఇంకా గట్టిగా పట్టుకొని,
ఇంతా చేసి ఆఖరుకి వయస్సు మళ్ళినపుడు, పట్టుసడలుతుందని తెలిసినా బుద్ధిరాదే,
పుఱ్ఱెలు కాళిక కాళ్ళక్రింద పఠ్ఠు పఠ్ఠు మని ప్రేలుతున్నా ఆ చప్పుటికి మేలుకువరాదే.
మాయమోహించి ముట్టుకుంటే బూడిదచేస్తుందని ఎఱుఁగకా,
తానైన ఈ మిథ్యాజగత్తులో తన మగని ఉనికి నిలుపుటకోసమై
ఎంతవారలనైనా కాంతదాసులని చేస్తుందని ఎఱుఁగకా,
కూడు దొరకక మనివేస్తే కడుపులో మంటై మండుతుందే,
ఆశ తీఱక అలసిపోయినపుడు మదిలో క్రోధమై రగులుతుందే,
కష్టపడి కూడు పోసిన వాడిని కొన్ని గడియలకు మరలా కాల్చనుందే,
ఎంతటెంతటికోనోర్చి ఆశ దీర్చిన వాడిని ఇంకా పెను యాశయై తోసిందే,
సత్తువున్న వాడిచేత నీరసుణ్ణి సంపించిందే, వాడి మాంసాని కూటిగా వీడికి పెట్టిందే,
ఇన్నీ చూసినా ఎంత చెప్పినా ఇంకా దాని వెంటే పోయిందే వెఱ్ఱి దేహము.
వైరాగ్యమను వికారముతో తిండి నప్పనినాడు
బండలని మ్రోసిమ్రోసి వీపు బ్రద్దలైననాడు
మాయలోఁబడి ఏది కానుకో ఏది కత్తివేటో తెలియనినాడు
బట్టకూడా పెట్టక కాడులమ్మట త్రిప్పే తన తిక్కమగని
ఈ ప్రక్కకు పంపుతుందని నమ్మి ఆగేదా
లేదా
ఏలాగూ వాడు గుడిసె వేసి కాసే కాటికేగా
కడకు పోయేదని తెలిసి అందాకా ఓర్చేదా?
అంకితం- ప.నా.రా
Saturday, August 07, 2010
చిత్తవృత్తం - పేడ నుండి మాలదీవులవఱకూ
ఇది నా వందవ టపా। ఐదేండ్లు నూరు టపాలు, ఏఁడాదికి ఇఱవై, పర్వాలేదు కనీసం నెలకొక్కటన్నమట సగటున।
ఒక ఆసక్తికరమైన చైతన్య స్రవంతి వేస్తున్నా। యోగం చిత్తవృత్త నివారణం కావున, నా గుఱించి టపాలు కట్టిపెట్టాను। కానీ ఇఱవై ఏండ్ల తరువాత చూసుకుంటే ఆసక్తికరంగా వుంటుందని ఇది వేస్తున్నాను। స్ఫూర్తి అక్షరాపేక్షలో ఎప్పుడో వేసిన చై.స్రం. టపా।
పొలాలమధ్యఁ ద్రోవలో వెళుతుంటే పేడకళ్ళు।
పేడకళ్ళు । హుఁ। "ఆ ఇంద్రప్రస్థానానికి వున్న పచ్చలు అప్పుడే వేసిన పేడలాగా తళతళా మెఱిసిపోతున్నాయటండి, ఏమి యోగి ఏమి యోగలక్షణం। ఏమి వైదికబ్రహ్మడండి నన్నయభట్టు। పచ్చలని పేడతో పోల్చడమేమిటండీ। గోమాత కంత గౌరవం మన సంస్కృతిలో। పేడని పచ్చలతో కాకుండా పచ్చలనే పేడతో పోల్చి చెప్పే గొప్ప భారతీయ సంస్కృతండి మనది " గరికిపాటి।
హుఁ।
అయినా పేడ'కళ్ళు' అని ఎందుకంటారో। పేడ కల్లు అనా పేడకండ్లు అనా। కన్నుల్లా వుంటాయి కాబట్టి కళ్ళు అనా। లేదా రాతిముద్దల్లావుంటాయి కాబట్టి కల్లు = ఱాయి అనా। కన్నడంలో ఱాయికి కల్లే అంటారు। అచ్చమయిన ద్రవిడపదం। ఓరుఁగల్లు, చాఁగల్లు, గుంతకల్లు। అలానే తెన్, అరవంలో దక్షిణం। అరవోళ్ళు ఎంతయినా ద్రవిడపదాలు వాడతారు। టెంకాయ, తెనాలి। ఈ ఊళ్ళన్నీ అంత పాతవన్నమట।
పైనుండి ఆర్యులు నొక్కుతూవుంటే ద్రవిడులు క్రిందకు పోయింటారు। అలా అచ్చమయిన ద్రవిడం ఇక్కడున్నప్పటి వూళ్ళయివుంటాయి పైవి। ఐస్క్రీము కూరినట్టు కూరేసివుంటారు। అలా అంతా దక్షిణభారతం జేరుకున్నారు। ఈ ఆర్యులూ ద్రవిడులూ ఏమిటో। మరి కోయవాళ్ళో, వాళ్ళ నొసలు బాగా ఎత్తుగా వుండి, చక్కిళ్ళూ గడ్డం త్రికోణాకారంలో వుంటాయి, స్పష్టంగా వేఱే -ఆష్ట్రలాయిడ్- జాతి లక్షణాలు వుంటాయి । మఱి వాళ్ళే అచ్చమయిన ద్రవిడులై , ఇప్పటి తెలుఁగు వారంతా - కనీసం పైకులాల వారు - ద్రవిడం స్వీకరించిన ఆర్యులైవుంటారు। ఆ తరువాత అంతా రంకులు ౘలిపి ఇప్పుడిలా అన్ని కులాలవారు అన్నిరకాలు గానూ వున్నారు। అచ్చమయిన రంకు భేదాలు ఎఱుఁగదు కదా।
లేక ఆదివాసీలు, ద్రవిడులు, ఆర్యులూ అని మూఁడు జాతులు ఒకటి తరువాత ఒకటి దక్షిణాపథం చేరుకున్నాయా। ఎవఁడు చూసివచ్చాడులే।
అతి ఉత్తరాన వున్న ద్రవిడప్రాంతం ఏమిటో। బహుశా ఆంధ్రరాష్టంలోని ఉత్రర తెలంగాణ అయివుంటుంది, లేదా గొండి ప్రాతం। అయితే ఆర్యులు లేదా ఆర్యభాషలు అటు గ్రీనులాండు, ఐరులాండు నుండి ఇటు మహారాష్ట్రం వఱకూ వున్నాయన్నమట। మహారాష్ట్రం వఱకూ వలసలు వచ్చారు భాషా పరంగా నెగ్గుకుంటూ। ఆఁ మఱచే పోయాను। సంహళం వుంది కదా ఆర్య భాష। లక్షదీవులు కూడా వున్నాయి కదా। వారికంటే 'తెన్ను' మాలదీవులు వున్నాయి కద। పాపం సముద్రం క్రింద సమావేశమయ్యారు, పర్యావరణ మీద అవగాహన తీసుకురావడానికి। ముందు ఏ స్విమ్మింగు పూలులోనో ప్రాక్టీసు చేసుకొని అప్పుడే సముద్రంలోనికి దిగివుంటారులే।
సరి। చిత్తవృత్తనిరోధం। ఆలోచన బంద్। ఈ నిమిషంలో వుండు, ప్రకృతి ఆస్వాదించు। ఇంతకీ ఎక్కడ మొదలయ్యింది స్రవంతి। పేడకళ్ళతో కద। ఇంతకీ కల్లా అవి కండ్లా? మళ్ళీ మొదటికి!
ఒక ఆసక్తికరమైన చైతన్య స్రవంతి వేస్తున్నా। యోగం చిత్తవృత్త నివారణం కావున, నా గుఱించి టపాలు కట్టిపెట్టాను। కానీ ఇఱవై ఏండ్ల తరువాత చూసుకుంటే ఆసక్తికరంగా వుంటుందని ఇది వేస్తున్నాను। స్ఫూర్తి అక్షరాపేక్షలో ఎప్పుడో వేసిన చై.స్రం. టపా।
పొలాలమధ్యఁ ద్రోవలో వెళుతుంటే పేడకళ్ళు।
పేడకళ్ళు । హుఁ। "ఆ ఇంద్రప్రస్థానానికి వున్న పచ్చలు అప్పుడే వేసిన పేడలాగా తళతళా మెఱిసిపోతున్నాయటండి, ఏమి యోగి ఏమి యోగలక్షణం। ఏమి వైదికబ్రహ్మడండి నన్నయభట్టు। పచ్చలని పేడతో పోల్చడమేమిటండీ। గోమాత కంత గౌరవం మన సంస్కృతిలో। పేడని పచ్చలతో కాకుండా పచ్చలనే పేడతో పోల్చి చెప్పే గొప్ప భారతీయ సంస్కృతండి మనది " గరికిపాటి।
హుఁ।
అయినా పేడ'కళ్ళు' అని ఎందుకంటారో। పేడ కల్లు అనా పేడకండ్లు అనా। కన్నుల్లా వుంటాయి కాబట్టి కళ్ళు అనా। లేదా రాతిముద్దల్లావుంటాయి కాబట్టి కల్లు = ఱాయి అనా। కన్నడంలో ఱాయికి కల్లే అంటారు। అచ్చమయిన ద్రవిడపదం। ఓరుఁగల్లు, చాఁగల్లు, గుంతకల్లు। అలానే తెన్, అరవంలో దక్షిణం। అరవోళ్ళు ఎంతయినా ద్రవిడపదాలు వాడతారు। టెంకాయ, తెనాలి। ఈ ఊళ్ళన్నీ అంత పాతవన్నమట।
పైనుండి ఆర్యులు నొక్కుతూవుంటే ద్రవిడులు క్రిందకు పోయింటారు। అలా అచ్చమయిన ద్రవిడం ఇక్కడున్నప్పటి వూళ్ళయివుంటాయి పైవి। ఐస్క్రీము కూరినట్టు కూరేసివుంటారు। అలా అంతా దక్షిణభారతం జేరుకున్నారు। ఈ ఆర్యులూ ద్రవిడులూ ఏమిటో। మరి కోయవాళ్ళో, వాళ్ళ నొసలు బాగా ఎత్తుగా వుండి, చక్కిళ్ళూ గడ్డం త్రికోణాకారంలో వుంటాయి, స్పష్టంగా వేఱే -ఆష్ట్రలాయిడ్- జాతి లక్షణాలు వుంటాయి । మఱి వాళ్ళే అచ్చమయిన ద్రవిడులై , ఇప్పటి తెలుఁగు వారంతా - కనీసం పైకులాల వారు - ద్రవిడం స్వీకరించిన ఆర్యులైవుంటారు। ఆ తరువాత అంతా రంకులు ౘలిపి ఇప్పుడిలా అన్ని కులాలవారు అన్నిరకాలు గానూ వున్నారు। అచ్చమయిన రంకు భేదాలు ఎఱుఁగదు కదా।
లేక ఆదివాసీలు, ద్రవిడులు, ఆర్యులూ అని మూఁడు జాతులు ఒకటి తరువాత ఒకటి దక్షిణాపథం చేరుకున్నాయా। ఎవఁడు చూసివచ్చాడులే।
అతి ఉత్తరాన వున్న ద్రవిడప్రాంతం ఏమిటో। బహుశా ఆంధ్రరాష్టంలోని ఉత్రర తెలంగాణ అయివుంటుంది, లేదా గొండి ప్రాతం। అయితే ఆర్యులు లేదా ఆర్యభాషలు అటు గ్రీనులాండు, ఐరులాండు నుండి ఇటు మహారాష్ట్రం వఱకూ వున్నాయన్నమట। మహారాష్ట్రం వఱకూ వలసలు వచ్చారు భాషా పరంగా నెగ్గుకుంటూ। ఆఁ మఱచే పోయాను। సంహళం వుంది కదా ఆర్య భాష। లక్షదీవులు కూడా వున్నాయి కదా। వారికంటే 'తెన్ను' మాలదీవులు వున్నాయి కద। పాపం సముద్రం క్రింద సమావేశమయ్యారు, పర్యావరణ మీద అవగాహన తీసుకురావడానికి। ముందు ఏ స్విమ్మింగు పూలులోనో ప్రాక్టీసు చేసుకొని అప్పుడే సముద్రంలోనికి దిగివుంటారులే।
సరి। చిత్తవృత్తనిరోధం। ఆలోచన బంద్। ఈ నిమిషంలో వుండు, ప్రకృతి ఆస్వాదించు। ఇంతకీ ఎక్కడ మొదలయ్యింది స్రవంతి। పేడకళ్ళతో కద। ఇంతకీ కల్లా అవి కండ్లా? మళ్ళీ మొదటికి!
Monday, July 05, 2010
ఇంసోమ్నియపు పద్యాలు ౨ - నలదమయంతులు
నిన్న రాత్రి పడుకునే ముందు కవికోకిల
ఒకటి(౧), వాడినవాటిలో సగానికి పైగా మత్తేభాలలో ఆఖగురువును తరువాతి పాదపు లఘువులతో కలిపేస్తారు, ఆ మాత్రం దానికి UII UUII UI UI IIU UII UII అని కడ గురువును ముందఱ చేర్చేయవచ్చుగా ఛందోరీతిలోనే।
రెండు(౨) యతిస్థానంలో పదంవిఱిచేవారు చాలా తక్కువ। యతికి అటూ యిటూ ఒకే పదభాగాలు వుంటాయి। ఈ రెండు నియమాలూ సంస్కృతంలోనైతే చెల్లవు। తెలుఁగులోనే ॥ ఈ తెలుగు నియమాలకంటే నాకు సంస్కృత నియమాలే నచ్చాయి। నేను శతకం వ్రాసినప్పుడు వాటికే ప్రాముఖ్యతనిస్తాను।
మూఁడవది(౩), పొల్లులు (జిలుగున్, రంగులున్, సిరికిన్, శంఖచక్రయుగమున్) అజంతభాషలో అన్ని పొల్లులు వాడి వృత్తపద్యం వ్రాయకపోతేనేం అనిపిస్తుంది। సీసాలో గీతాలో వ్రాసుకోవచ్చుగా।
ఏదేమైనా, పొల్లులు లేకుండా(౩), యతిస్థానే విఱుపు వచ్చేట్టు(౨), పాదం నుండి పాదం కలుపకుండా(౧) పద్యం వ్రాయడం అంత కష్టమా అనిపించి ఆలోచిస్తే, ఈ పద్యం వచ్చింది।
ముందు రెండు పాదాలు వ్రాసాక ఇది నలునకు అన్వయించుకోవచ్చునని దానికి తగ్గటు మూఁడవ పాదము వ్రాసాను।
ఇప్పుడు పెద్దలు వచ్చి దిధీలకు ప్రాసచెల్లదంటారు!!!
ఇంసోమ్నియపు పద్యాలు ౧
"జిలుగుం(౩) బంగరు రంగులుం(౩)గలుగు మే(౨)ల్చిన్నారి పూగుత్తి సొ-(౧)పద్యము చదివి నిద్రపోఁబోతే, తెలుఁగులో శార్దూలాలూ మత్తేభాలూ ఎందుకు వాడతారో అని నాకు వెయ్యోసారి పరాకుగాననిపించింది।
మ్ములు గీలించిన తుమ్మకొమ్మలకు నీ(౨)వున్(౩) నీ సతీరత్న మూ-(౧)
యెల గీమున్(౩) దగిలించి రేఁబవలు హా(౨)యిం(౩)దూఁగరా గాడ్పు బి-(౧)
డ్డలు మీ కూడిగ మాచరింప గిజిగాఁ(౨)డా నీకు దీర్ఘాయువౌ"
ఒకటి(౧), వాడినవాటిలో సగానికి పైగా మత్తేభాలలో ఆఖగురువును తరువాతి పాదపు లఘువులతో కలిపేస్తారు, ఆ మాత్రం దానికి UII UUII UI UI IIU UII UII అని కడ గురువును ముందఱ చేర్చేయవచ్చుగా ఛందోరీతిలోనే।
రెండు(౨) యతిస్థానంలో పదంవిఱిచేవారు చాలా తక్కువ। యతికి అటూ యిటూ ఒకే పదభాగాలు వుంటాయి। ఈ రెండు నియమాలూ సంస్కృతంలోనైతే చెల్లవు। తెలుఁగులోనే ॥ ఈ తెలుగు నియమాలకంటే నాకు సంస్కృత నియమాలే నచ్చాయి। నేను శతకం వ్రాసినప్పుడు వాటికే ప్రాముఖ్యతనిస్తాను।
మూఁడవది(౩), పొల్లులు (జిలుగున్, రంగులున్, సిరికిన్, శంఖచక్రయుగమున్) అజంతభాషలో అన్ని పొల్లులు వాడి వృత్తపద్యం వ్రాయకపోతేనేం అనిపిస్తుంది। సీసాలో గీతాలో వ్రాసుకోవచ్చుగా।
ఏదేమైనా, పొల్లులు లేకుండా(౩), యతిస్థానే విఱుపు వచ్చేట్టు(౨), పాదం నుండి పాదం కలుపకుండా(౧) పద్యం వ్రాయడం అంత కష్టమా అనిపించి ఆలోచిస్తే, ఈ పద్యం వచ్చింది।
నల ఉవాచ-
మ। విధియో కాలఁపు వక్రదృష్టివలనో పేరాశ హెచ్చించెనో
మదిలో మూఢఁపు భావజాలమహిమో మత్కర్మ సంక్షిప్తమో
కద నేడీగతినిద్దఱం వనములోనీవుఁనైనుఁ వనిలోకష్టాల పాలైతిమే
పదవే ముందుకు ధైర్యచిత్తముననో పద్మాక్షి చింతింపకే
ముందు రెండు పాదాలు వ్రాసాక ఇది నలునకు అన్వయించుకోవచ్చునని దానికి తగ్గటు మూఁడవ పాదము వ్రాసాను।
ఇప్పుడు పెద్దలు వచ్చి దిధీలకు ప్రాసచెల్లదంటారు!!!
ఇంసోమ్నియపు పద్యాలు ౧
Friday, June 25, 2010
మావూరి కథ
మూఁడు వీదుల మా గ్లోబల్ విలేజిలో
దేశాలను విడదీశారు
మొదటి రెండవ మూడవ ప్రపంచాలుగా ॥
ఊరికొక్క షావకారు వెనకటికి ఋషులుగా బ్రతికినవారు
ఇంట్లోవారిచే చెప్పులు కుట్టించి పెరట్లో పెట్టి అమ్ముతున్నారు।
భార్యా పిల్లల రక్తాన్ని పాలుగా మలచి త్రాగారు
బాగా బలిశారు కాసులకు అలుసయ్యారు।
చచ్చిన నానా విశ్వకర్ములుఁ అందాకా చేసిన వ్యాపారాలు
యికమందు సాగడానికెన్నో యంత్రాలు నిలిపారు, చైనా వీరి పేరు ॥
ఊరిలోనొక కుఱ్ఱకారు ఊరందరికీ 'పెద్ద' దిక్కు
వ్యవసాయం తక్కువైన ఒట్టి చార్వాకుడు
సుఖాల తోటలో శయనించు మహాభోగి।
జనాలకు పనిలేకుండా పోకూడదని
అప్పు చేసి అన్నీ కొంటాడు, వాడుకుంటాడు।
హలాహలాన్ని నిత్యం మ్రింగేవాడు
అంతరంగం శూన్యమైనవాడు, వీడి పేరు అమెరికా॥
యువరాజుగారి ఆగడాలను
మావలూతాతలూ మేమేం తక్కువంటూ
అనుకరించి అపుడపుడూ భంగపడతారు
వీరి పేరు ఐరోపా।
మహాషావుకారితో పోటీపడుతూనే పడలేకే
చిల్లరవస్తువులమ్మే తోపుడుబళ్ళు
ఊరినిండా వారే మిగిలినవారు॥
అయ్యో ఒకనాడు అప్పుల్లో పడ్డాడు యువరాజు
ఆయన కొనకపోతే ఊరికే ఉద్యోగం లేదు।
పిల్లల్ని కాళీగావుంచలేక షావుకారు
యువరాజుకు అప్పిచ్చి సారాయి పోశాడు।
ఊళ్ళో అందరూ తలోచేయి వేసి
చేతనైనంత కల్లు దోసిట్లో పోసి
చిన్నయ్యగారిని ఆదుకున్నారు॥
ఊరిచుట్టూ కొండంతా పిండి, తోటంతా త్రవ్వి
చేయించిన ఆసనాలకూ, పండించిన గంజాయికీ
వ్యసన పడి, బానిసై, ప్రకృతి గుణాలకు పావైనాడు ।
వీడి శరీరంలో అణువణువూ అపుడోకొంతా ఇపుడోకొంతా
కొన్న షావుకారికి మిగిలిందీ జీవచ్ఛవం॥
క్షామకాలం మీదపడుతుండగా
రేపు రాబోయే పెనువిపత్తుకు
ఏర్పాట్లకు తీఱికలేని యాపారులంతా
ఎండుటాకుల్లా రాలినప్పుడు,
మిగిలిన ఆ నలుగురితో
మరుజనమెత్తనుంది మా వూరు।
తాగుమోతులా తాండవించి
పుఱ్ఱెలు కాలరాసే కాలానికి
మావూరు చూపిన చోద్యాలు ఎన్నో
వాటన్నిటిలోనూ ఇది ఒక్కటి మాత్రమే॥
* ముందుగా పొద్దు పత్రికలో కవికృతి(కవులవికృతిసమ్మేళనం) సందర్భంగా ప్రచురితం।
దేశాలను విడదీశారు
మొదటి రెండవ మూడవ ప్రపంచాలుగా ॥
ఊరికొక్క షావకారు వెనకటికి ఋషులుగా బ్రతికినవారు
ఇంట్లోవారిచే చెప్పులు కుట్టించి పెరట్లో పెట్టి అమ్ముతున్నారు।
భార్యా పిల్లల రక్తాన్ని పాలుగా మలచి త్రాగారు
బాగా బలిశారు కాసులకు అలుసయ్యారు।
చచ్చిన నానా విశ్వకర్ములుఁ అందాకా చేసిన వ్యాపారాలు
యికమందు సాగడానికెన్నో యంత్రాలు నిలిపారు, చైనా వీరి పేరు ॥
ఊరిలోనొక కుఱ్ఱకారు ఊరందరికీ 'పెద్ద' దిక్కు
వ్యవసాయం తక్కువైన ఒట్టి చార్వాకుడు
సుఖాల తోటలో శయనించు మహాభోగి।
జనాలకు పనిలేకుండా పోకూడదని
అప్పు చేసి అన్నీ కొంటాడు, వాడుకుంటాడు।
హలాహలాన్ని నిత్యం మ్రింగేవాడు
అంతరంగం శూన్యమైనవాడు, వీడి పేరు అమెరికా॥
యువరాజుగారి ఆగడాలను
మావలూతాతలూ మేమేం తక్కువంటూ
అనుకరించి అపుడపుడూ భంగపడతారు
వీరి పేరు ఐరోపా।
మహాషావుకారితో పోటీపడుతూనే పడలేకే
చిల్లరవస్తువులమ్మే తోపుడుబళ్ళు
ఊరినిండా వారే మిగిలినవారు॥
అయ్యో ఒకనాడు అప్పుల్లో పడ్డాడు యువరాజు
ఆయన కొనకపోతే ఊరికే ఉద్యోగం లేదు।
పిల్లల్ని కాళీగావుంచలేక షావుకారు
యువరాజుకు అప్పిచ్చి సారాయి పోశాడు।
ఊళ్ళో అందరూ తలోచేయి వేసి
చేతనైనంత కల్లు దోసిట్లో పోసి
చిన్నయ్యగారిని ఆదుకున్నారు॥
ఊరిచుట్టూ కొండంతా పిండి, తోటంతా త్రవ్వి
చేయించిన ఆసనాలకూ, పండించిన గంజాయికీ
వ్యసన పడి, బానిసై, ప్రకృతి గుణాలకు పావైనాడు ।
వీడి శరీరంలో అణువణువూ అపుడోకొంతా ఇపుడోకొంతా
కొన్న షావుకారికి మిగిలిందీ జీవచ్ఛవం॥
క్షామకాలం మీదపడుతుండగా
రేపు రాబోయే పెనువిపత్తుకు
ఏర్పాట్లకు తీఱికలేని యాపారులంతా
ఎండుటాకుల్లా రాలినప్పుడు,
మిగిలిన ఆ నలుగురితో
మరుజనమెత్తనుంది మా వూరు।
తాగుమోతులా తాండవించి
పుఱ్ఱెలు కాలరాసే కాలానికి
మావూరు చూపిన చోద్యాలు ఎన్నో
వాటన్నిటిలోనూ ఇది ఒక్కటి మాత్రమే॥
* ముందుగా పొద్దు పత్రికలో కవికృతి(కవులవికృతిసమ్మేళనం) సందర్భంగా ప్రచురితం।
Subscribe to:
Posts (Atom)
