చెవిటివాని ముందు శంఖం వూదితే, దాన్ని కొఱకడానికి నీ తాతలు దిగిరావాలన్నాట్ట! బ్లాగ్లోకం కూడా వెనకటిలాలేదు. అనామిషులూ ముక్కూ మొఖం లేని నెలతక్కువ బడుద్దాయిలు ఎక్కువయ్యారు. ఏ పుంతలోనుండి ఏ చెంబు పట్టుకొని ఎవడు వచ్చి విసర్జించి పోతాడో తెలియకుండా వుంది. అందుకే క్రిందటి టపా తీసేయడమైనది.
త.క- మీ అసౌకర్యార్ధం, భావి తరాలా సమాచారార్ధం ఇక్కడ దాన్ని జత చేస్తున్నాను. దయచేసి చదవద్దు. ఇది భావితరాలకు మాత్రమే.
------------
లంజాకొడుకు అద్వైతం
మీకు టపా శీర్షిక పరుషంగా అనిపించి కోపం వచ్చి, కూడలిజల్లాడాదులధిపతులకు నా బ్లాగును లంకించడం మానేయాలని అభ్యర్ధిస్తే, మీరు బుద్ధుడు కదన్నమట. ఆయనీపాటికే నా బ్లాగుకు రావాలి, వచ్చాడేమోనని ఇలా శీర్షిక పెట్టాను. కానీ పాడు విధి వక్రించింది ఆయన రాలేదు. ఈ విధి ఎప్పుడు వక్రిస్తుందేగానీ ఒక్కసారైనా అవక్రిస్తుందేమో చూద్దాం అనుకుంటే, అబ్బే లాభం లేదు, విధి విధి ఎప్పుడూ వక్రించేవుంటుంది.
మీరు ఏ గౌతమబుద్ధుడో, ఆదిశంకరాచార్యుడో అయితే మీకు కోపం వచ్చేది కాదు. ఎందుకంటే వారికి అద్వైతం ఎఱుక. మనకి ఎఱుక కాదు. అద్వైతం అంటే అందరికీ తెలిసు. ఏముంది, అన్నీ ఒకే పదార్ధం నుండి పుట్టాయి, మళ్ళీ అన్ని ఒకే పదార్ధంలోనికి వెళిపోతాయి. ఈ మాత్రం విషయం మీ బామ్మగారినడిగితే చెబుతుంది, "ఏముందిరా, మట్టిలోంచి పుట్టాం మట్టిలోకే పోతాం". మీ బామ్మగారు ఆమె మాట మీద నిలబడి ఇప్పటికే మట్టిలో కలసిపోయుంటే , ఎనిమిదో తరగతి చదివే మీ మనఁవరాలినడగండి చెబుతుంది, "తాత్గరూ, మన సన్ను మూడో జనరేషన్ స్టార్ అంట. అంటే ఇంతకు ముందు ఒక స్టార్ క్రియేట్ అయ్యి, అది డిస్ట్రాయ్ అయ్యి, మళ్ళీ క్రియేట్ అయ్యి... అలా త్రీ టైమ్స్ జరిగి ఇప్పుడు సాలార్ సిస్టమ్ అయితే మనం దాని మీద లివ్ చేస్తున్నామఁట". మీరు లోలోపల మీ మనఁవరాలి ఆంగ్ల చదువులకు ముఱిసిపోతూనే, బయటకు కోపం అభినయిస్తూ, "నువ్వేమయినా చూసొచ్చావా మూఁడు సార్లు జరగడం" అని అడుగుతారు. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. ఒక లక్ష కోట్ల ఏండ్ల క్రితం మీ ప్రస్తుత శరీరంలోని పరమాణువులన్నీ ఏదో ఎక్కడో అంతరిక్షంలో తిరుగుతూవుండేవని మీరు ఒప్పుకోక తప్పదు.
కాబట్టి, ఒక విషయం తెలియడం తేలికే, అది తెలిసినట్టు ప్రవర్తించడం వేఱే పని. మనందరికీ అద్వైతం తెలిసినా, అది నిత్యం ఎఱింగి అలా నడుచుకోవడం వేఱే. ఉదా- మీకు తెలుసుఁ ప్లాస్టిక్కు ఐదు లక్షల ఏండ్లు భూమ్మీదనలానే శనిలా పడుంటుందని, కానీ పెళ్ళిల్లో రైళ్ళలో వాటిల్లోంచే నీళ్ళు తాగుతాం. కాబట్టి మనకు అద్వైతం తెలిసినా మనల్ని ఎవరైనా లంజాకొడకా అంటే మనకు కోపమే వస్తుంది.
ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, నేను క్రిత టపాలో ఒక కందం పద్యం వ్రాసాను. నా మొదటి సర్వలఘుకందం. దాంట్లో ఒక బూతు పదం అవసరమైంది. నేను బూతుపదాల్లో నమ్మను. కొందరు "దేవుడు లేడు, ఉంటే ఏడి చూపించి" అన్నట్టు, నేను "బూతుపదం లేదు, వుంటే ఏది చూపించు" అని అడుగే బాపతు. కానీ దేవుణ్ణి చూపమనేవారు కూడా తిరుపతి వెళ్ళివచ్చినట్టు, నేను కూడా క్రిత టపాలో గణికకొడుకులు అనే మాటవాడాల్సివచ్చింది.
కం. పలుపలు వరములు జనులుకుఁ
గలుపుదుమనుచును గలగలఁ గడు కపటములన్
బలుకుచు గెలుపుల కలలలొఁ
గులుకుచుఁ గదిలె డల గణిక కొడుకులఁ గనుమా
లంజాకొడకా అని ఎందుకు వాడలేదని మీరడగవచ్చు. దానికి రెండు కారణాలు. నేను వ్రాసింది సర్వలఘు కందం. కాబట్టి జా,లం వంటివి వాడకూడదు. అదే తెనాలి రామలింగడు వ్రాసిన గంజాయి తాగి పద్యం లోనయితే ముచ్చటగా వాడుకోవచ్చు.
కం. గంజాయి త్రావి తురకల
సంజాతము చేసికల్లు చవి గొన్నావా
లంజల కొడకా ఎక్కడ
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్
రెండవ కారణం, నేను వ్రాసిన పద్యంలో క,గ,ల,లు అనుప్రాస. గణికకొడుకులు లో క,గ,లలు ఐదు వచ్చాయి. కూల్ కదా.
మొత్తానికి అలా "అల గణికకొడుకులని రాజకీయనాయకులతో పోల్చి చెప్పినందుకు" వారికి క్షమాపణ చెప్పుకోవడం కుదరలేదు క్రిత టపాలోఁ. అందుకే ఇంకో టపా వ్రాయాల్సివచ్చింది. అసలు లంజాకొడుకులు అవడంలో వారి తప్పేముంది? మీ నాన్నగారు ఫలానా కారు సేల్సుమానో, అడ్వర్టైజింగు మేనేజరో, రాజకీయనాయకుడో, బాక్సైటు గనుల గుత్తేదారో, ఇతరత్రా ద్రోహచింతనాత్మక వ్యాపరస్థులో అవడంలో మీ తప్పేముంది. మీరు వారిని కన్నారా, పెంచారా, కేవలం మీ విధి తన అలవాట్లు మానుకోలేక వక్రించడం వల్ల మీరు వారి కడుపున పుట్టారు. లంజతండ్రి అనేది తిట్టుగాని లంజకొడుకు తిట్టుఎలా అవుతుంది?
అయినా మీరు వేశ్యాంగనకు జన్మించారే అనుకుందాం, వారి వృత్తిలో తప్పేముంది. వారు ఎవరినైనా మోసం చేశారా? లేదు. కాయకష్టం పడి సంపాదించారు. కాయకష్టం పడకుండా బోలెడంత సంపాదించే సాఫ్టువేరోళ్ళ కన్నా వీరు ఏమాత్రం హీనులు కారు. శరీరావసరాలకు వాళ్ళని వాడుకొని, సంఘంలో నొక మూలకు తోసిన మీ పేరు బూతు. సంఘం అనే మాట బూతు. అయినా నేను ఇందాక చెప్పినట్టు బూతుల్లో నమ్మను, "ఏదీ ఈ సంఘం ఎక్కడుంది? చూపీ నాకు". నాలుగు గాడిదల వయస్సు వచ్చినా మీరు పెళ్ళి చేయని మీ అబ్బాయి ఆరాటం ఏట్లోకట్ల కిందా మీదా పడి మాన్పించే స్త్రీయోత్తములు, నీరాటవనాటములు పోరాటపడ్డప్పుడు భద్రకుంజరపు ఆరాటము ఘోరాటవిలోన మాన్పిన పురుషోత్తముని సమానులు కారా? ఏరి మాట్లాడరే ఎవరూను? నోరు పడిపోయిందా?
గుఱజాడ కన్యాశుల్కం (Girls for Sale) చదివి కూడా, మధురవాణిగా సావిత్రిని చూసికూడా వారిని చిన్నచూపు చూసే మీరు+ చేసేది మనోలంజరికం. ఇది కూడా బూతు కాదు, తప్పుడు పనీకాదూ, అయినా మీ దయాత్మక సమాచారం కోసం చెబుతున్నాను. <+ ఇక్కడ మీరు అంటే కొన్ని సామాజిక వర్గాలని హీనంగా చూసేవారు మాత్రమే>
మీమల్ని ఎవరైనా పలానా తలారి సుబ్బయ్య కొడుకు అని పరిచయం చేయబోతే, మీరు అబ్బే కాదండి, ఫోన్లు, మైకు సెట్లు వంటి వున్న ఈ రోజుల్లో ఇక తలారితనం ఎవరు చేస్తున్నారండి, మా అయ్యకూడా కూలి పనిలోకే వెళ్తున్నాడు, అని వివరిస్తారా లేదా. అలాగే ఎవరైనా మనల్ని లంజాకొడకా అంటే, మనం కూడా అబ్బే కాదండి, టీవీ, సినిమాలు, ఐటెం సాంగులు, ఇంటర్నెట్టు వంటి వున్న ఈ రోజుల్లో ఇక లంజరికం ఎవరు చేస్తున్నారండి, మా అమ్మకూడా కూలి పనిలోకే వెళ్తుందండి. అని వివరించుకోవాలి. అలా కాకపోతే, ఏ రిప్రడక్టివ్ థెరపిస్టు అనో, నాన్ లీనియర్ ఎడిటర్ అనో, స్పేస్ షటిల్ ప్రోగ్రామర్ అనో వివరించుకోవాలి.
అలా మొత్తానికి బుద్ధుణ్ణి మనం వేశ్యాసుతుఁడని స్తుతించినా ఆయనకు తేడావుండదు (చాలా రాజకీయనాయకులుకు చేతినిండా పని చిక్కుతుందనుకోండి). ఎందుకంటే అద్వైత స్వరూపుణ్ణి ఏమని పిలిచినా ఒకటేగా. చేపగా పుట్టినోడు, పందిగా పుట్టినోడు, తాబేలుగా పుట్టినోడు, రాజుగా పుట్టినోడు, గొల్లవానిగా పుట్టినోడు, బ్రాహ్మణపిల్లవాడిగా పుట్టినోడు, అలానే వడ్రంగిగా ఖండాంతరంలో పుట్టిన వాడు. పిల్లిగా వేరేదో దేశంలో పుట్టిన వాడు. అలగే ఇతర పశు పక్ష జంతాదులుగా పుట్టిన వాడు. స్త్రీగా పుట్టినది. వేశ్యగానే పుట్టినది. అసలు పుట్టనేపుట్టనిది. అట్టిదానిని ఏమని పిలిస్తేనేం. అట్టిది వేశ్యకడుపున పుడితేనేం?
అసలు బూతు అనేది వినేవాడి చెవిలోనుంది. ఉదా- మీరు ఎవరినో ఒకరిని సరదాకి "రండి రాజశేఖర రెడ్డిగారు" అని మర్యాద చేస్తే; అతను కాంగ్రేస్ కార్యకర్త అయితే సంబరపడిపోతాడు. తెలుఁగుదేశం కార్యకర్త అయితే, మిమ్మల్ని మళ్ళీ ఏ లంజాకొడుకనో అంటాడు. అతని దృష్టిలోనది బూతు కాబట్టి.
అర్థమయ్యిందనుకుంట వేదాంతం. అయితే మనకు ఇప్పుడో చిక్కువచ్చిపడింది. నా పద్యంలో అల గణికకొడుకుల గనుమా అని అంటే రాజకీయనాకులను మెచ్చుకున్నట్టుంటుంది గాని తిట్టినట్టు వుండదు. అయితే ఇప్పుడేం చేద్దాం. యు నో వాట్... తఱించి చూస్తే మనమెవ్వరం బుద్ధులం గాము. ఆచార్యులమూ కాము. కాబట్టి పద్యాన్ని అలానే వదిలేస్తే సరిపోతుంది.
<ఇక్కడింకా వుంది సోది .. కానీ నేను భద్రపఱచుకున్న దానిలో ఇంతవఱకే యుంది. క్షమించగలరు>
జై యల్లమ్మ తల్లి.
భాషందం, భువనందం, బ్రతుకందం
Thursday, May 14, 2009
Thursday, April 23, 2009
వోటరు నెంబరు ౫౦౦ - రానారె
రాకేశ్వర నాయిడు రెడ్డి...
ఉరఫ్ రానారె, ఇవాళ వోటు వేశాడు. దూరదేశాల్లో వున్న ప్రవాస తెలుఁగు వారు తమ వోటు హక్కు బాధ్యతా మఱియు సంబరాల్లో పాల్గొనలేక పోయినవారికి ఆ అనుభూతి కలుగఁజేయడానికి ఇదిగో నేను నా అనుభూతి పంచుకుంటున్నాను. ఈ రోజుల్లో తెలుఁగు నాట నాలుగు పార్టీల వఱకూ వున్నాయి, సగటున ౧౦ అభ్యర్ధుల వఱకూ ఎన్నికల్లో నిలబడుతున్నారు.

అనుభూతి అంటే పెద్ద అనుభూతి ఎం వుంటుంది లెండి. ఎవరికి వోటేశావు ఎలా వేశావు అనేది చెప్పాలి. మీకు తెలుసో తెలియదోగాని గత రెండు నెలల పాటుగాఁ టీవీల ద్వారా, పత్రికల ద్వారా జనాలకు చిత్రవధ పెట్టారు పలు పక్షాలవారు.
నేను పుట్టినరోజున ఇలానే సార్వత్ర ఎన్నికలు సర్వత్రా జరిగాయి. అది ౧౯౮౩. నేను పుట్టి, ఎంటీవోణ్ణి గెలిపించాను. తెలుఁగు ఆత్మగౌరవం సంబడం చేసుకుంది. తెలుఁగులో లుగులకు మధ్యలోనున్న అఱసున్నా పునర్జీవితఁపు కలలు కంది. అఱసున్నాలోని అసులకు మధ్యనున్న ఱ కూడా కొత్త కలలు కంది. ప్రజాస్వామ్యంలోని సగటు కలలవలెఁ సదరు కలలు నెఱవేఱలేదనుకోండి అది వేఱేవిషయం. (అఱసున్నాలోఁ ఱవాడాలో రవాడాలో నాకు స్పష్టంగా తెలియదు. ఏదో అత్యుత్సాహాన్ని మన్నించగలరు.)
ఇంతకీ చెప్పవచ్చేదేంటంటే, మేము ఎప్పుడూ తెలుఁగు దేశానికే వేస్తాం. వేంటనే చంద్రబాబు నాయిడు మా పార్టీని లక్ష్మీపార్వతి నుండి రక్షించినప్పుడు మీరు ఎవరికివేశారు అని సందేహపడవచ్చు. అప్పుడు బాలయ్యబాబులాగా మేము కూడా సైకిల్ గుర్తుకే వోటేశాం. ఇలా తరతరాలుగా, అతిశయోక్తులు ఎందుకులెండి, ఇలా ఒక తరంగా సైకిలు గుర్తుకు ఓటు బ్యాంకై వెలసినాము మేము నాయిడ్రెడ్లం. కాని క్రితం సారి మాలో కొందరు - అంటే మా ఉమ్మడి కుటుంబంలో కొందరు - ఉమ్మడి కుటుంబం అనగా వూరిలో కొందరు ఉచిత విద్యుత్తు కోసం కాంగ్రేసోడికి వోటేశారు. అసలే మా రైతులకు ధనదాహం ఎక్కువ, మా దాహాన్ని దీర్చే పోగాకు తోటకి జలదాహం ఎక్కువ, అ జలానికి విద్యద్దాహం ఎక్కువ, విద్యుత్తునకు ధనదాహం ఎక్కువ, మొత్తానకి లెక్క సరిపోయి గుండు సున్నా అయ్యిందిగా. కానీ ఉచిత విద్యుత్తు అనేది తప్పుడు పద్ధతి, ఒక రకమైన అన్యాయం, దీని వల్ల కర్చులు బాహ్యమౌతాయని ఎఱిఁగిన మా అయ్యలాంటి వాళ్లు, అలా ఎఱుఁగని తెలుఁగు దేశం కార్యకర్త అయిన మా అమ్మలాంటి వాళ్ళు, ఎఱిఁగీ ఎఱఁగకున్న బెంగుళూరిలో ఉద్యోగంలో మునిగివుండి తెలుగుదేశం ఎలాగూ నగ్గుతుందిలే అనుకున్న నాలాంటి వాళ్ళు తప్ప మిగిలిన చాలా మందిలో కొంత మంది సైకిలుకి హ్యాండిచ్చారు. హ్యాండుకి బ్రహ్మరథం పట్టారు. (బ్రహ్మరథం పట్టడం అంటేఁ జంపి స్వర్గానికి పంపడం అని అసలర్థం వుందని మీరు ఎఱుఁగుదురా?) అలా హస్తానికి కుర్చీ వేసిన మావూరి జనాన్ని ఈనాడు చదివేవాళ్ళు క్షమిస్తారనీ, సాక్షి చదివే వారు కీర్తిస్తారనీ భావిస్తున్నాను. వెల్ మొత్తానికి జరగాల్సినది జరిగింది, ఆ బాబు శేఖర నాయిడ్రెడ్ల ప్రారబ్ధ కర్మలకు జరిగిన ఆ సంగ్రామంలో, మా వరి కొబ్బర్ల నాయిడ్రెడ్లు విద్యుల్లంచం తీసుకొని ఇచ్చిన తీర్పు అందరికీ ఎఱుఁకే.
ఐదేండ్ల తరువాత....
ధర్మం కలికాలంలో ఒక పాదం మీద నడుస్తుందంట. ఎనకెప్పుడో నాలుగు పాదాల మీద నడిచేదఁట. అలా నలుగు కాళ్ళుండే ధర్మగర్దభం ఈనాటికి పరమకుంటిదయ్యింది, మిగిలియున్న యా ఒంటికాలి మీద కూడా మన ముఖ్య మంత్రి గారు కత్తెత్తారని గత ఐదేండ్లుగా పత్రికలవారు మొత్తుకుంటూనేవున్నారు. వారి ప్రతాపానికి నీరసఁబడ్డ నాలాంటి పాత అభిమానులకు ఆక్రోశం పుట్టింది. మార్పు కోరాం. అలా మాలాగ ఆలోచించిన చిరంజీవి, చంద్రశేఖర రావు, జైప్రకాశ్ నారాయణ్ వంటి వారు నాట్సో-కొత్త పార్టీలకు కొత్త ఊపు తెచ్చారు. ఇలా ఎన్నికల పెళ్లి భోజనంలో విస్తరి నిండా వడ్డించి ఏదో ఒక్కటి మాత్రమే తినాలని విన్న పెళ్ళిపెద్దలాగా మేము కూడా బిక్కమొహం వేశాం. కానీ సమయానికి మా బాబు యువగర్జన అని గర్జించాడు. అలా మాకు విస్తరిలో పసుప్పచ్చగా వుండే రెండు చక్రాల జిలేబీనే తినాలి అని గుర్తుకొచ్చింది.
కొంత సేపు గర్జన గుఱించి చెప్పుకుందాం. మొన్నొక రోజు నేనూనొక బ్లాఙ్మిత్రుడూను గోదావరి పర్యాటనకై బైకేసుకుని వెళుతున్నాం. ఇద్దరం మహామేధావులం కాబట్టి. నాలుగు గర్దభాల వయస్సొచ్చినా, సజ్జోగోజ్జోగాలు లేక ఇలా బైకుల మీద తిఱిగి గర్వపడేవారిని మేధావులే అనాలిగా. అలా మేం మేధావులం బైకు మీద వెళుతూ, కనిపించిన లోకాన్ని అవహేళన చేస్తూ ఆనందిస్తుంటే, ఒక చోటఁ మాల గర్జననో, కావుంటి గర్జన నో ఎదో గర్జన చూసాం. మందకృష్ణ బొమ్మ వుందనుకుంట, రాజమండ్రిలో మాదిగ గర్జన అయుంటుంది. మొత్తానికి గర్జన అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం, ఏ కులపుటోరిదైతేనే గర్జన. (అన్నట్టు సామాజిక వర్గం, దళిత, వైశ్య, ఇలాంటి సాంస్కరిత సంస్కృత పదాలు వాడలేదని మీకు అభ్యంతరం కలుగవచ్చు, మేము ఏదో పాతకాలపుటోరం, అంత ఓపిక లేక సాంస్కరిత సాంస్కృతిక పత్రికలకు పంపుకోలేక ఇలా బ్లాగుల్లో వ్రాసుకుంటున్నాం. క్షతహృదయులు క్షమించగలరు.)
మొత్తానికి గర్జన గురించి గద మనం మాట్లాడుకుంటున్నాం, ఇలా యువ గర్జన, మాదిగ గర్జన వంటి గర్జనల పేర్లు చూసి ఒకటో రకం మేధావినైన నేను "హహ, మన జాతికింత మానసిక అభద్రతాభావం దేనికో, ప్రతిదానికీ తమనుతాము ఎప్పుడూ సింహాలతో పులులతోనూ పోల్చుకుంటూ వుంటారు. ప్రక్కవాళ్ళిని చంపుకుతినే కౄర మృగాలతో పోలిక ఏంటో, ప్రతీవాడు రాజుతో పోలికే. అలాగే ఐపియల్లో కూడా సగం జట్ల పేర్లో రాయల్సనో కింగ్సనో లయన్సనో వుంటుంది" అని అపహాస్యం చేసాను.
మేలు రకం మేధావి అయిన మన బ్లాఙ్మిత్రుడు (బ్లాగ్ + మిత్రుడు = బ్లాఙ్మిత్రుడు అనునాసిక సంధి) ఇంకా మేలురకంగా ఇలా "మాట్లాడితే మనుషులకు అర్థమవుతుంది గాని, వీడు గర్జిస్తాడఁట. హహహ" అని అపహాస్యం చేసాడు. మొత్తానికలా బ్లాగుల ద్వారా మీరెంత విడ్డూరమైన మనిషైనా, అంతకు మించిన విడ్డూరమైన మనిషి దొరుకుతాఁడు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అని తెలుఁగువారంటే, అతనికంటే ఇంగా ఘనుడు బట్టురాజు బాల అనిపిస్తుంది బ్లాగ్లోకం.
మొత్తానికలా ఎవరికి ఓటేయాలా అని ఆలోచిస్తున్న నాకు, గాలిపటం మీదకు తుఫానులా ఈ పథకాలు వచ్చిపడ్డాయి. నగదు బదిలీ అనీ, ఉచిత టీవీ అనీ, పసుపుకుంకుమలనీ, తొలిసూళ్ళని (గొడ్లకేనండోయ్), వడగండ్ల వర్షంలా వచ్చిపడ్డాయీ పాతకాత్మకములైన పథకాల. అప్పటికే ప్రపంచంలో లోభం ప్రసరిస్తుందని విలపిస్తున్న నాకు, కర్చులను బాహ్యింపజేసే వ్యవస్థ మీద వున్న కోపం వలన, ఉచితంగా వస్తువులు కావలని ఆశించిన వారి మీదఁ జుగుప్స, వాటిని ఇస్తామన్న వారి మీద విజుగుప్స హెచ్చించాయి. అప్పటి వఱకూ ఒక పద్ధతిలో రాజకీయం చేసుకుంటూ ముందుకు పోతావున్న చంద్రబాబు ఇలా పథకాలతో పతనమైపోవడం నాకు చాలా ఇబ్బంది కరంగా అనిపించింది. అలానే అప్పటి వఱకూ ఒక పద్ధతిలో పాత్రికేయం చేసుకుంటూ ముందుకు పోతావున్న ఈనాడు పత్రిక కూడా మఱీ ఇంత దారుణంగా కాంగ్రెసు మీద కసి కట్టడం, రోజూ చెడు వార్త మీద చెడువార్త అందించి వృత్తిధర్మాన్ని విస్మయించిన వారి మీద కాస్త జుగుప్స కలిగింది. ఇలా ఒకరి ప్రచారం చూసి ఇంకొకరి మీద జుగుప్స కలిగింది. అయినా తతో న విజుగుప్సతే అని స్మరించుకుంటూ ఆశా కిరణాలకై చూశాను. అలాంటి నాకు ఈల గోల వినిపించింది. జయప్రకాశు పథకాల మీద డబ్బు పంపిణీల మీదఁ జేస్తున్న వ్యాఖ్యలు నచ్చి, ఈ నా వోటు లోకసత్తాకేనని అనుకున్నాను. నిన్నటి వఱకూ.
కానీ మావారందఱూ తెదేపాకే నని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఎంతగా నంటే, మా మాజీ ఎమ్మల్లే మా కార్లు చూస్తే, ఆయని కారు మెల్లగా నడిపిస్తూ, మాకు కనబడేలా దణ్ణం పెడతాడు. మా కార్లంటే మా రెండు మూడు వూళ్ళలో రెడ్డినాయిళ్ళెవరికైనా సరేఁ. ఎంతైన ఊపిరితిత్తులకు పొగఁబట్టించి సంపాయించిన రైతు వర్గం కదా, అసలే అనాదిగా ఎస్సి నియోజకవర్గం, ఆయనేమో మాలాయన, కాబట్టి డబ్బు పంచినా ప్రచారం చేసిన మాలాంటోళ్ళేనని తెలుసుఁ. అలానే ఈ సారి ఎన్నికల్లో తెలుగుదేశం పేరిట నిల్చున్న ఆయని కుమార్తె కూడా మా చెల్లాయి పెళ్లిరోజు ప్రొద్దుట మా పెళ్ళింటికి వచ్చి, మరీ అందరినీ ఓటు అభ్యర్ధించింది. మేము పిలవలేదనుకోండి ప్రత్యేకించి, కానీ వచ్చింది ఎలాగైనా. ఊరు చిన్నూరై లోపలికున్నా దిట్టలని చెప్పి, గ్రహాల భారానికి కాంతి కణాలు వంగినట్లు వీరూ డబ్బు భారానికి వంగుతారు. మొత్తానికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మా అభ్యర్థిని బాగా చదువుకున్న ఆవిడ, వృత్తిరీత్య ఉపాధ్యాయిని, డాక్టరు పెండ్లాము. వోటుకు అర్హురాలు. కానీ కౌరవ పక్షానున్న భీష్ముడిలా, ఈవిడకూ ఓటు వేయదలచుకోలేదు నేను. నిన్నటి వఱకూ.
అలాగే మా లోకసభ అభ్యర్థి మురళీ మోహన్. మురళీ మోహన్ మంచి వాడు అనిపించేది నాకెప్పుడూ. కాబట్టి ఓటేద్దామనుకున్నాను. అప్పుడెప్పుడో తెలుపునలుపు చిత్రం జ్యోతిలో ఈయన జయసుధతో పాటు సైకిలు మీద వెళుతూ పాడుకున్న పాట చూసి, నేను సైకిలు గుర్తుకు ఆ ఓటు కేటాయించుదామనుకున్నాను.
నిన్నేం జరిగిందంటే...
మా లోకసత్తా అభ్యర్థి గుఱించి వాకబు చేసాను. వట్టి వెధవ అని తేలింది. ఎమ్మర్వోగా పనిచేసి, సరిగా వేయీ ఐదొందలకు కావలసిన పత్రం ఇచ్చేవాడు, ధర్మానికి న్యాయానికి సంబంధంలేకుండానని తేలింది. ఈ విషయం నాకు చెప్పింది ఒక తెలుగుదేశం కార్యకర్త అనుకోండి, కాని బుల్లిబాబు మాట నమ్మాలిగా. నమ్మాను.
ఇవాళ రోజూకంటే నాలుగు గంటలు ముందుగానే లేచాను. నిక్కరు వేసుకొని, సైకిలు మీద ఎక్కి మరీ వెళ్ళాను పోలింగి స్టేషనీకి, అరగంట లైనులో నించుంటే, వూరోళ్ళందరూ వచ్చి కొంత పిచ్చాపాటీ చెప్పుకుంటూ, ఆడవాళ్ళూ ముసలివాళ్ళూ వస్తే వాళ్ళని లోనికి రానిస్తూ, చిన్న చిన్న గొడవలు పడుతూ మొత్తానికి రెండు సైకిళ్ళకి ఓటేశాను. సరదా తీరలేదు. ప్రక్కనే మా నానమ్మ ఇంటికి వెళ్ళి ఆవిడను తీసుకువచ్చి, లైను మొత్తం తప్పించి, సంతకం చేయించి, ఇంకు పూయించి, డబ్బా వరకూ తీసుకువెళ్ళి వోటువేయించాను. మీకో విషయం తెలుసా, ముసలి వాళ్ళు వుంటే వారికి సరిగా కనబడకపోయినా, కనపడదన్న వంకనయినా, మీరు వారిని బూతు దగ్గరికి తీసుకువెళ్ళి ఇదిగో ఇక్కడ నొక్కు అని చూపించవచ్చని.
ఎనకయితే ఇన్ని పార్టీలు లెనప్పుడు ఒక్కొక్కళ్ళూ నాలుగయిదు వోట్లేశేవారు. ఇంకు అంటించగానే తలకు రాసేసుకోవాలి, అలా అది కొబ్బిరి నూనెలో కలసిపోతుంది. ఆ తరువాత హైదరాబాదో పరదేశమో వలసఁబోయిన మీ అన్నదమ్ముల పేర్ల మీదఁ, అక్కజెళ్ళల్ల పేర్ల మీదనో ఓటు గుద్దేయవచ్చు. కానీ ఈరోజుల్లో నాయిడ్రెడ్ల ఐక్యత తగ్గింది. కొందరు పెజారాజ్యం వంటి పార్టీల్లో కెళ్ళి అలా చేయనీయట్లేదు. పైగా ఫోటోలు చూపించమంటున్నారు.
అదన్న మాట నా ఎన్నికల అనుభూతి, అసలయితే మా పక్క నియోజక వర్గంలో మా మావయ్యే ఎన్నికల్లో నిలబడ్డాడు. లెక్క ప్రకారం ఆయని ప్రచారానికి వెళ్ళాలి. కానీ ఇక్కడ నాకు ఇతర ముఖ్యమైన పనులు వుండీ, చంద్రబాబు చంద్రుణ్ణి తెంపియిస్తానని చేస్తున్న హామీలు నచ్చక మొత్తానికి అంత ఉత్సాహం లేక వెళ్ళలేదు. హామీలు నచ్చకపోవడం ఎలా వున్నా ముందు ఇంటర్నెట్ పని వుండింది. ఆ మాత్రం దానికి మా బుల్లి బాబే అన్నాడు వాడు అన్న హామీలన్నీ పూర్తి చేస్తే ఎవడూ పనిలోకి రాడు, రైతు *&$# చిరిగిపోతుంది, కాబట్టి చెయ్యడెః అని. అది మన రాజకీయాల పరిస్థితి. మన పార్టీకి మనం వోటేసుకోవాలి అన్నది వేదవాక్కు.
వెల్, మొత్తానికలా ఓటైతే వేసి వచ్చాం. పనసగింజల కూరా, గెడ్డ పెరుగూ తిన్నాం. నా ఒక్క వోటు వల్ల రాష్ట్రం, దేశం, ప్రపంచం ఏదైనా ఒకింతైనా మారుతుందా అంటే, యూగాట్టాబీ కిడ్డింగ్ మీ. పోనీ మా వూళ్ళో ౩౦౦ వోట్లు, అందులో ౧౦౦ ప్రవాసులు, వాటివల్లా పెద్దేం మారదు. కానీ అందరం ఓటేస్తే, ఎవరో ఒకరి ఓటు కీలకం అవుతుందిగా. ఆస్తలవీస్త (అలాగే లగెత్తుతా అని అర్థం)
* పై పద్యంలో తమని రాజకీయనాయకులతో పోల్చామని భంగపడ్డ శునకములను/గణికలను క్షమించమని సవినయంగా మనవిచేసుకుంటున్నాను. ఏదో పద్యవరసకు అన్నాను గానీ, ఆ దానవమూర్తుల ముందు జంతు/మనావ మాత్రులమైన మనమేపాటి.
ఉరఫ్ రానారె, ఇవాళ వోటు వేశాడు. దూరదేశాల్లో వున్న ప్రవాస తెలుఁగు వారు తమ వోటు హక్కు బాధ్యతా మఱియు సంబరాల్లో పాల్గొనలేక పోయినవారికి ఆ అనుభూతి కలుగఁజేయడానికి ఇదిగో నేను నా అనుభూతి పంచుకుంటున్నాను. ఈ రోజుల్లో తెలుఁగు నాట నాలుగు పార్టీల వఱకూ వున్నాయి, సగటున ౧౦ అభ్యర్ధుల వఱకూ ఎన్నికల్లో నిలబడుతున్నారు.

అనుభూతి అంటే పెద్ద అనుభూతి ఎం వుంటుంది లెండి. ఎవరికి వోటేశావు ఎలా వేశావు అనేది చెప్పాలి. మీకు తెలుసో తెలియదోగాని గత రెండు నెలల పాటుగాఁ టీవీల ద్వారా, పత్రికల ద్వారా జనాలకు చిత్రవధ పెట్టారు పలు పక్షాలవారు.
నేను పుట్టినరోజున ఇలానే సార్వత్ర ఎన్నికలు సర్వత్రా జరిగాయి. అది ౧౯౮౩. నేను పుట్టి, ఎంటీవోణ్ణి గెలిపించాను. తెలుఁగు ఆత్మగౌరవం సంబడం చేసుకుంది. తెలుఁగులో లుగులకు మధ్యలోనున్న అఱసున్నా పునర్జీవితఁపు కలలు కంది. అఱసున్నాలోని అసులకు మధ్యనున్న ఱ కూడా కొత్త కలలు కంది. ప్రజాస్వామ్యంలోని సగటు కలలవలెఁ సదరు కలలు నెఱవేఱలేదనుకోండి అది వేఱేవిషయం. (అఱసున్నాలోఁ ఱవాడాలో రవాడాలో నాకు స్పష్టంగా తెలియదు. ఏదో అత్యుత్సాహాన్ని మన్నించగలరు.)
ఇంతకీ చెప్పవచ్చేదేంటంటే, మేము ఎప్పుడూ తెలుఁగు దేశానికే వేస్తాం. వేంటనే చంద్రబాబు నాయిడు మా పార్టీని లక్ష్మీపార్వతి నుండి రక్షించినప్పుడు మీరు ఎవరికివేశారు అని సందేహపడవచ్చు. అప్పుడు బాలయ్యబాబులాగా మేము కూడా సైకిల్ గుర్తుకే వోటేశాం. ఇలా తరతరాలుగా, అతిశయోక్తులు ఎందుకులెండి, ఇలా ఒక తరంగా సైకిలు గుర్తుకు ఓటు బ్యాంకై వెలసినాము మేము నాయిడ్రెడ్లం. కాని క్రితం సారి మాలో కొందరు - అంటే మా ఉమ్మడి కుటుంబంలో కొందరు - ఉమ్మడి కుటుంబం అనగా వూరిలో కొందరు ఉచిత విద్యుత్తు కోసం కాంగ్రేసోడికి వోటేశారు. అసలే మా రైతులకు ధనదాహం ఎక్కువ, మా దాహాన్ని దీర్చే పోగాకు తోటకి జలదాహం ఎక్కువ, అ జలానికి విద్యద్దాహం ఎక్కువ, విద్యుత్తునకు ధనదాహం ఎక్కువ, మొత్తానకి లెక్క సరిపోయి గుండు సున్నా అయ్యిందిగా. కానీ ఉచిత విద్యుత్తు అనేది తప్పుడు పద్ధతి, ఒక రకమైన అన్యాయం, దీని వల్ల కర్చులు బాహ్యమౌతాయని ఎఱిఁగిన మా అయ్యలాంటి వాళ్లు, అలా ఎఱుఁగని తెలుఁగు దేశం కార్యకర్త అయిన మా అమ్మలాంటి వాళ్ళు, ఎఱిఁగీ ఎఱఁగకున్న బెంగుళూరిలో ఉద్యోగంలో మునిగివుండి తెలుగుదేశం ఎలాగూ నగ్గుతుందిలే అనుకున్న నాలాంటి వాళ్ళు తప్ప మిగిలిన చాలా మందిలో కొంత మంది సైకిలుకి హ్యాండిచ్చారు. హ్యాండుకి బ్రహ్మరథం పట్టారు. (బ్రహ్మరథం పట్టడం అంటేఁ జంపి స్వర్గానికి పంపడం అని అసలర్థం వుందని మీరు ఎఱుఁగుదురా?) అలా హస్తానికి కుర్చీ వేసిన మావూరి జనాన్ని ఈనాడు చదివేవాళ్ళు క్షమిస్తారనీ, సాక్షి చదివే వారు కీర్తిస్తారనీ భావిస్తున్నాను. వెల్ మొత్తానికి జరగాల్సినది జరిగింది, ఆ బాబు శేఖర నాయిడ్రెడ్ల ప్రారబ్ధ కర్మలకు జరిగిన ఆ సంగ్రామంలో, మా వరి కొబ్బర్ల నాయిడ్రెడ్లు విద్యుల్లంచం తీసుకొని ఇచ్చిన తీర్పు అందరికీ ఎఱుఁకే.
ఐదేండ్ల తరువాత....
ధర్మం కలికాలంలో ఒక పాదం మీద నడుస్తుందంట. ఎనకెప్పుడో నాలుగు పాదాల మీద నడిచేదఁట. అలా నలుగు కాళ్ళుండే ధర్మగర్దభం ఈనాటికి పరమకుంటిదయ్యింది, మిగిలియున్న యా ఒంటికాలి మీద కూడా మన ముఖ్య మంత్రి గారు కత్తెత్తారని గత ఐదేండ్లుగా పత్రికలవారు మొత్తుకుంటూనేవున్నారు. వారి ప్రతాపానికి నీరసఁబడ్డ నాలాంటి పాత అభిమానులకు ఆక్రోశం పుట్టింది. మార్పు కోరాం. అలా మాలాగ ఆలోచించిన చిరంజీవి, చంద్రశేఖర రావు, జైప్రకాశ్ నారాయణ్ వంటి వారు నాట్సో-కొత్త పార్టీలకు కొత్త ఊపు తెచ్చారు. ఇలా ఎన్నికల పెళ్లి భోజనంలో విస్తరి నిండా వడ్డించి ఏదో ఒక్కటి మాత్రమే తినాలని విన్న పెళ్ళిపెద్దలాగా మేము కూడా బిక్కమొహం వేశాం. కానీ సమయానికి మా బాబు యువగర్జన అని గర్జించాడు. అలా మాకు విస్తరిలో పసుప్పచ్చగా వుండే రెండు చక్రాల జిలేబీనే తినాలి అని గుర్తుకొచ్చింది.
కొంత సేపు గర్జన గుఱించి చెప్పుకుందాం. మొన్నొక రోజు నేనూనొక బ్లాఙ్మిత్రుడూను గోదావరి పర్యాటనకై బైకేసుకుని వెళుతున్నాం. ఇద్దరం మహామేధావులం కాబట్టి. నాలుగు గర్దభాల వయస్సొచ్చినా, సజ్జోగోజ్జోగాలు లేక ఇలా బైకుల మీద తిఱిగి గర్వపడేవారిని మేధావులే అనాలిగా. అలా మేం మేధావులం బైకు మీద వెళుతూ, కనిపించిన లోకాన్ని అవహేళన చేస్తూ ఆనందిస్తుంటే, ఒక చోటఁ మాల గర్జననో, కావుంటి గర్జన నో ఎదో గర్జన చూసాం. మందకృష్ణ బొమ్మ వుందనుకుంట, రాజమండ్రిలో మాదిగ గర్జన అయుంటుంది. మొత్తానికి గర్జన అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం, ఏ కులపుటోరిదైతేనే గర్జన. (అన్నట్టు సామాజిక వర్గం, దళిత, వైశ్య, ఇలాంటి సాంస్కరిత సంస్కృత పదాలు వాడలేదని మీకు అభ్యంతరం కలుగవచ్చు, మేము ఏదో పాతకాలపుటోరం, అంత ఓపిక లేక సాంస్కరిత సాంస్కృతిక పత్రికలకు పంపుకోలేక ఇలా బ్లాగుల్లో వ్రాసుకుంటున్నాం. క్షతహృదయులు క్షమించగలరు.)
మొత్తానికి గర్జన గురించి గద మనం మాట్లాడుకుంటున్నాం, ఇలా యువ గర్జన, మాదిగ గర్జన వంటి గర్జనల పేర్లు చూసి ఒకటో రకం మేధావినైన నేను "హహ, మన జాతికింత మానసిక అభద్రతాభావం దేనికో, ప్రతిదానికీ తమనుతాము ఎప్పుడూ సింహాలతో పులులతోనూ పోల్చుకుంటూ వుంటారు. ప్రక్కవాళ్ళిని చంపుకుతినే కౄర మృగాలతో పోలిక ఏంటో, ప్రతీవాడు రాజుతో పోలికే. అలాగే ఐపియల్లో కూడా సగం జట్ల పేర్లో రాయల్సనో కింగ్సనో లయన్సనో వుంటుంది" అని అపహాస్యం చేసాను.
మేలు రకం మేధావి అయిన మన బ్లాఙ్మిత్రుడు (బ్లాగ్ + మిత్రుడు = బ్లాఙ్మిత్రుడు అనునాసిక సంధి) ఇంకా మేలురకంగా ఇలా "మాట్లాడితే మనుషులకు అర్థమవుతుంది గాని, వీడు గర్జిస్తాడఁట. హహహ" అని అపహాస్యం చేసాడు. మొత్తానికలా బ్లాగుల ద్వారా మీరెంత విడ్డూరమైన మనిషైనా, అంతకు మించిన విడ్డూరమైన మనిషి దొరుకుతాఁడు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అని తెలుఁగువారంటే, అతనికంటే ఇంగా ఘనుడు బట్టురాజు బాల అనిపిస్తుంది బ్లాగ్లోకం.
మొత్తానికలా ఎవరికి ఓటేయాలా అని ఆలోచిస్తున్న నాకు, గాలిపటం మీదకు తుఫానులా ఈ పథకాలు వచ్చిపడ్డాయి. నగదు బదిలీ అనీ, ఉచిత టీవీ అనీ, పసుపుకుంకుమలనీ, తొలిసూళ్ళని (గొడ్లకేనండోయ్), వడగండ్ల వర్షంలా వచ్చిపడ్డాయీ పాతకాత్మకములైన పథకాల. అప్పటికే ప్రపంచంలో లోభం ప్రసరిస్తుందని విలపిస్తున్న నాకు, కర్చులను బాహ్యింపజేసే వ్యవస్థ మీద వున్న కోపం వలన, ఉచితంగా వస్తువులు కావలని ఆశించిన వారి మీదఁ జుగుప్స, వాటిని ఇస్తామన్న వారి మీద విజుగుప్స హెచ్చించాయి. అప్పటి వఱకూ ఒక పద్ధతిలో రాజకీయం చేసుకుంటూ ముందుకు పోతావున్న చంద్రబాబు ఇలా పథకాలతో పతనమైపోవడం నాకు చాలా ఇబ్బంది కరంగా అనిపించింది. అలానే అప్పటి వఱకూ ఒక పద్ధతిలో పాత్రికేయం చేసుకుంటూ ముందుకు పోతావున్న ఈనాడు పత్రిక కూడా మఱీ ఇంత దారుణంగా కాంగ్రెసు మీద కసి కట్టడం, రోజూ చెడు వార్త మీద చెడువార్త అందించి వృత్తిధర్మాన్ని విస్మయించిన వారి మీద కాస్త జుగుప్స కలిగింది. ఇలా ఒకరి ప్రచారం చూసి ఇంకొకరి మీద జుగుప్స కలిగింది. అయినా తతో న విజుగుప్సతే అని స్మరించుకుంటూ ఆశా కిరణాలకై చూశాను. అలాంటి నాకు ఈల గోల వినిపించింది. జయప్రకాశు పథకాల మీద డబ్బు పంపిణీల మీదఁ జేస్తున్న వ్యాఖ్యలు నచ్చి, ఈ నా వోటు లోకసత్తాకేనని అనుకున్నాను. నిన్నటి వఱకూ.
కానీ మావారందఱూ తెదేపాకే నని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఎంతగా నంటే, మా మాజీ ఎమ్మల్లే మా కార్లు చూస్తే, ఆయని కారు మెల్లగా నడిపిస్తూ, మాకు కనబడేలా దణ్ణం పెడతాడు. మా కార్లంటే మా రెండు మూడు వూళ్ళలో రెడ్డినాయిళ్ళెవరికైనా సరేఁ. ఎంతైన ఊపిరితిత్తులకు పొగఁబట్టించి సంపాయించిన రైతు వర్గం కదా, అసలే అనాదిగా ఎస్సి నియోజకవర్గం, ఆయనేమో మాలాయన, కాబట్టి డబ్బు పంచినా ప్రచారం చేసిన మాలాంటోళ్ళేనని తెలుసుఁ. అలానే ఈ సారి ఎన్నికల్లో తెలుగుదేశం పేరిట నిల్చున్న ఆయని కుమార్తె కూడా మా చెల్లాయి పెళ్లిరోజు ప్రొద్దుట మా పెళ్ళింటికి వచ్చి, మరీ అందరినీ ఓటు అభ్యర్ధించింది. మేము పిలవలేదనుకోండి ప్రత్యేకించి, కానీ వచ్చింది ఎలాగైనా. ఊరు చిన్నూరై లోపలికున్నా దిట్టలని చెప్పి, గ్రహాల భారానికి కాంతి కణాలు వంగినట్లు వీరూ డబ్బు భారానికి వంగుతారు. మొత్తానికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మా అభ్యర్థిని బాగా చదువుకున్న ఆవిడ, వృత్తిరీత్య ఉపాధ్యాయిని, డాక్టరు పెండ్లాము. వోటుకు అర్హురాలు. కానీ కౌరవ పక్షానున్న భీష్ముడిలా, ఈవిడకూ ఓటు వేయదలచుకోలేదు నేను. నిన్నటి వఱకూ.
అలాగే మా లోకసభ అభ్యర్థి మురళీ మోహన్. మురళీ మోహన్ మంచి వాడు అనిపించేది నాకెప్పుడూ. కాబట్టి ఓటేద్దామనుకున్నాను. అప్పుడెప్పుడో తెలుపునలుపు చిత్రం జ్యోతిలో ఈయన జయసుధతో పాటు సైకిలు మీద వెళుతూ పాడుకున్న పాట చూసి, నేను సైకిలు గుర్తుకు ఆ ఓటు కేటాయించుదామనుకున్నాను.
నిన్నేం జరిగిందంటే...
మా లోకసత్తా అభ్యర్థి గుఱించి వాకబు చేసాను. వట్టి వెధవ అని తేలింది. ఎమ్మర్వోగా పనిచేసి, సరిగా వేయీ ఐదొందలకు కావలసిన పత్రం ఇచ్చేవాడు, ధర్మానికి న్యాయానికి సంబంధంలేకుండానని తేలింది. ఈ విషయం నాకు చెప్పింది ఒక తెలుగుదేశం కార్యకర్త అనుకోండి, కాని బుల్లిబాబు మాట నమ్మాలిగా. నమ్మాను.
ఇవాళ రోజూకంటే నాలుగు గంటలు ముందుగానే లేచాను. నిక్కరు వేసుకొని, సైకిలు మీద ఎక్కి మరీ వెళ్ళాను పోలింగి స్టేషనీకి, అరగంట లైనులో నించుంటే, వూరోళ్ళందరూ వచ్చి కొంత పిచ్చాపాటీ చెప్పుకుంటూ, ఆడవాళ్ళూ ముసలివాళ్ళూ వస్తే వాళ్ళని లోనికి రానిస్తూ, చిన్న చిన్న గొడవలు పడుతూ మొత్తానికి రెండు సైకిళ్ళకి ఓటేశాను. సరదా తీరలేదు. ప్రక్కనే మా నానమ్మ ఇంటికి వెళ్ళి ఆవిడను తీసుకువచ్చి, లైను మొత్తం తప్పించి, సంతకం చేయించి, ఇంకు పూయించి, డబ్బా వరకూ తీసుకువెళ్ళి వోటువేయించాను. మీకో విషయం తెలుసా, ముసలి వాళ్ళు వుంటే వారికి సరిగా కనబడకపోయినా, కనపడదన్న వంకనయినా, మీరు వారిని బూతు దగ్గరికి తీసుకువెళ్ళి ఇదిగో ఇక్కడ నొక్కు అని చూపించవచ్చని.
ఎనకయితే ఇన్ని పార్టీలు లెనప్పుడు ఒక్కొక్కళ్ళూ నాలుగయిదు వోట్లేశేవారు. ఇంకు అంటించగానే తలకు రాసేసుకోవాలి, అలా అది కొబ్బిరి నూనెలో కలసిపోతుంది. ఆ తరువాత హైదరాబాదో పరదేశమో వలసఁబోయిన మీ అన్నదమ్ముల పేర్ల మీదఁ, అక్కజెళ్ళల్ల పేర్ల మీదనో ఓటు గుద్దేయవచ్చు. కానీ ఈరోజుల్లో నాయిడ్రెడ్ల ఐక్యత తగ్గింది. కొందరు పెజారాజ్యం వంటి పార్టీల్లో కెళ్ళి అలా చేయనీయట్లేదు. పైగా ఫోటోలు చూపించమంటున్నారు.
అదన్న మాట నా ఎన్నికల అనుభూతి, అసలయితే మా పక్క నియోజక వర్గంలో మా మావయ్యే ఎన్నికల్లో నిలబడ్డాడు. లెక్క ప్రకారం ఆయని ప్రచారానికి వెళ్ళాలి. కానీ ఇక్కడ నాకు ఇతర ముఖ్యమైన పనులు వుండీ, చంద్రబాబు చంద్రుణ్ణి తెంపియిస్తానని చేస్తున్న హామీలు నచ్చక మొత్తానికి అంత ఉత్సాహం లేక వెళ్ళలేదు. హామీలు నచ్చకపోవడం ఎలా వున్నా ముందు ఇంటర్నెట్ పని వుండింది. ఆ మాత్రం దానికి మా బుల్లి బాబే అన్నాడు వాడు అన్న హామీలన్నీ పూర్తి చేస్తే ఎవడూ పనిలోకి రాడు, రైతు *&$# చిరిగిపోతుంది, కాబట్టి చెయ్యడెః అని. అది మన రాజకీయాల పరిస్థితి. మన పార్టీకి మనం వోటేసుకోవాలి అన్నది వేదవాక్కు.
వెల్, మొత్తానికలా ఓటైతే వేసి వచ్చాం. పనసగింజల కూరా, గెడ్డ పెరుగూ తిన్నాం. నా ఒక్క వోటు వల్ల రాష్ట్రం, దేశం, ప్రపంచం ఏదైనా ఒకింతైనా మారుతుందా అంటే, యూగాట్టాబీ కిడ్డింగ్ మీ. పోనీ మా వూళ్ళో ౩౦౦ వోట్లు, అందులో ౧౦౦ ప్రవాసులు, వాటివల్లా పెద్దేం మారదు. కానీ అందరం ఓటేస్తే, ఎవరో ఒకరి ఓటు కీలకం అవుతుందిగా. ఆస్తలవీస్త (అలాగే లగెత్తుతా అని అర్థం)
కం. పలుపలు వరములు జనులుకుఁ
గలుపుదుమనుచును గలగలఁ గడు కపటములన్
బలుకుచు గెలుపుల కలలలొఁ
గులుకుచుఁ గదిలె డల శునక/గణిక కొడుకులఁ గనుమా
* పై పద్యంలో తమని రాజకీయనాయకులతో పోల్చామని భంగపడ్డ శునకములను/గణికలను క్షమించమని సవినయంగా మనవిచేసుకుంటున్నాను. ఏదో పద్యవరసకు అన్నాను గానీ, ఆ దానవమూర్తుల ముందు జంతు/మనావ మాత్రులమైన మనమేపాటి.
Friday, March 27, 2009
సింహరాశి అనానిమిషులు - 'సింహవిరోధి' సపోర్టు గుంపు
నేను ఏదో పుస్తకాల కొట్టు కెళ్లి ఏవో పుస్తకాలు కొంటే వాడు పోనీలే పాపం అని నాకు ఒక పంచాంగం బహుకరించాడు. అది తిఱగవేస్తూ ఈ ఏఁడు ఏ రాశి వారికి ఆదాయం ఎంత, రాజపూజ్యం ఎంత, వ్యయం ఎంత అవమానం ఎంత అని చూస్తూండగా. నా రాశి అయిన సింహరాశికి వచ్చే సరికి వ్యయానికి(౫) రెండితల ఆదాయం(౧౧), అవమానానికి(౩) రెండితల రాజపూజ్యం(౬) చూసి తెగ సంబర పడిపోయాను. అలాగే మేష రాశివారి ఫలితాలు జూసి చాలా జాలివేసింది. ఆదాయం రెండయితే వ్యయం ఎనిమిదఁట, రాజపూజ్యం ఒకటైతే అవమానం ఏడఁట! అయ్యోపాపం అనుకుని వారి ఫలితాలు చదవగా "ఈ రాశి వారికి ఈ సంవత్సరము అనుకూలము" అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఓహో ఈ అంఖెల్లో ఏం లేదన్నమట! అయితే ఒక సారి సంహిరాశిలోకి వెళ్ళి మన ఫలితాలు ఎలా వున్నాయో సువివరంగా తెలుసుకుందా అని చదవడం మొదలు పెట్టాను.
===========================================
"*&^) మ్యాన్, ఈ ఏఁడు బాగా *&^% పోయినట్టున్నాం" అనుకున్నాను. వీడు ఇంత సువివరంగా వ్రాయడం మానేసి, "ఈ ఏఁటికి ఈ రాశి వారి కర్మ గుడిసెటిది" అని క్లుప్తంగా వ్రాసివుంటే ఆయనకీ నాకూఁ కాస్త శ్రమ తగ్గేదిగా.
వ్యాపారం చేద్దామంటే నష్టపోతామంట. ఉద్యోగం చేయబోతే అది కాస్తా ఊడిపోతుందఁట. పోనీలే మళ్ళీ పైచదువులకు పోదామంటే, అవీ కుదరవఁట. రాజకీయం, వ్యాపారం, వ్యవసాయం కళారంగం అబ్బే ఎక్కడా లాభం లేదు. పోనీలే పెళ్ళి చేసుకుంటే పోతుంది అని అనుకుంటే, ఆ భాగ్యమూలేదు. పెపెచ్చు అనారోగ్యం కూడానఁట. కాబట్టి ఈ ఏఁడు కూడా ఇలా నిస్త్రాణ నిరాశలతో గడిపేయాలఁట. (నిస్త్రాణ nis-trāṇa. n. Weakness.).
పోనీలెండి, ఈయనెవరో ముందే చెప్పి మనల్ని మానసికంగా సిద్ధంగా వుంచాడు. ఇప్పుడు నాకు ఏంజరిగినా, "అఱె ఆ రోజు పలానా నామాని వారి పంచాంగంలో అచ్చం ఇలాంటిదే జరుగుతుందని వ్రాసారే" అనుకోవచ్చు. అలానే అడ్డమైన ప్రయత్నాలలో శ్రమ, డబ్బు ఖర్చు మానుకోవచ్చు. ఇంచక్కా కాళీగా కూర్చుని బ్లాగులు చదువుకోవచ్చు.
===========================================
ఏమిటి రాకేశ్, ఇంతా చదువుకొని నువ్వు కూడా ఇలాంటి మూడనమ్మకాలు పెట్టుకంటావా?
ఆఖరికి ఇంతకి దిగజారిపోయావా?
ఇవన్ని సోది మాటలు రాకేశ్, పొట్టగడుపుకోవడానికి వ్రాస్తారు, వాటిని నమ్మకూడదు.
అసలే స్టాటిస్టికల్ అనలిష్టువి, వెయ్యమందిలో ఒకఁడికి పది సార్లు టాసు వేస్తే వరుసగా పదిసార్లూ బొరుసే రావడం సహజం అని తెలిసినవాడివి. మానవకృషి యొక్క విలువ తెలియకపోవడమేమిటి?
ఇలాంటి మాటలు మీరు అంటూవుండవచ్చు.
అవును నిజమే, నేను చాలా చదువుకున్నాను. లెక్కల నుండి ఛందస్సు వఱకూ, ఆర్థిక శాస్త్రం నుండి మానసిక శాస్త్రం వఱకూ. ఆచార్యుని అద్వైతం దగ్గర నుండి ఐనిస్టీను రిలేటివిటీ వఱకూ చాలా విషయాలు చూచాయిగా పరిచయం కూడా వున్నాయి. ఏన్నో పరీక్షలు కష్టపడి వ్రాసాను, పలుదేశాల్లో పలు రంగాల్లో పనికూడా చేశాను.
నేనూ రెండేండ్ల క్రితం వఱకూ మీలాగానే ఆలోచించాను. తుస్ ఈ జాతకాల్లో ఏం లేదని. ఇదే ఏలినాటి శని గుఱించి మీరు నాకు రెండేళ్ళ క్రితం అనగా ౨౦౦౭ ఉగాదిలో చెప్పుంటే. "తుస్ శనీ లేడు గినీ లేడు, నా రాశిలో కొస్తేనేం, వెనుకభాగం మీద తంతే, వీధవతల పడతాడు" అనేవాడిని. అలా ౨౦౦౮ ఉగాదిలో చెబితే, "వెల్... అంటే... ఇలాంటివి నమ్మకూడదనుకో... కానీ చెప్పలేం.. ద యీనివర్స్ కెనోన్లీ బీ సో రేణ్డమ్ కదా... దానీకీ దీనికీ స్టాటిస్టికల్ కోరిలేషన్ వుండడం పెద్ద ఆశ్చర్యమేముంది. గత ఏఁడాది నేను అనుకున్నట్టుగా ఒక్కటీ జరగలేదు చూడండి. మా బామ్మ కూడా 'జాతకం బాలేదురా అందుకే అమెరికానుంచి వచ్చేసావు' అనంది" అని అనేవాడిని.
ఇక ఈ ఏటికి వచ్చేసరికి పంచాంగం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసాను. "శని ఎలా వున్నాడు, అతనికి అన్ని మర్యాదలూ జరుగుతున్నాయా, ఇంకెన్నాళ్ళుంటాడు మన రాశిలో" వంటివి తెలుసుకుందామని. వాళ్ళు "పర్వాలేదు, ఈ ఏఁడు బానేవుంటుంది" అనంటే నా పనులు నేను చూసుకుందామని, లేకుంటా - ప్రస్తుతం ఉన్నట్లుగా కాళీగానే వుందామని నిర్ణయించుకున్నాను.
మొన్నటి వఱకూ ఎవరైనా "వూళ్లోనేం చేస్తున్నావు? ఎప్పుడు వెళ్తున్నావు?" అనడిగితే మార్చనో మాఘమనో ఏదో చెప్పేవాడిని. ఇప్పుడేమో ఆ శ్రమంతా లేక "ఇక్కడే వుంటున్నా ఎక్కడికీ వెళ్ళట్లేదు" అని చెబుతున్నాను. ఇఁక మొన్నొకసారి ఒక హస్తజ్యోతిష్యుని దగ్గర చెయ్య చూపించుకుంటే, "అఱ్ఱె ఈపాటికే నువ్వు ఆసుపత్రిలోనుండాలే" అన్నాడు. "వెల్ డ్యూడ్ యు గాటే పాయింట్" అనుకున్నాను మనసులో. అలా ఆ డ్యూడ్ పాయింటుతో అప్పటికే బలంగానున్న నా నమ్మకం ఇంకా బలపడింది.
పోనీ లెండి నల్లమబ్బుకి తెల్లంచు అన్నట్టు. ఫైనాన్సులో వున్నవారికి లాభదాయకం అన్నాడు. కాబట్టి నేను ప్రస్తుతం చేస్తున్న డెరివేటివ్ ట్రేడింగ్ . కొనసాగిస్తే సరిపోతుందిదేమో. అసలే రెండు నెలలుగా లాభాలువస్తున్నాయి. అలలే ఇవాళ అచ్చంగా నా కోసమే అన్నట్టు నిఫ్టీ 3050 పైన ఆగింది. కాని నా స్నేహితురాలు తన తరఫున కూడా పెట్టుబడి పెట్టమంటుంది. "నా పంచాంగంలో జాయింటు వ్యాపారం వల్ల నష్టాలు వస్తాయనుంది, కాబట్టి నీ రెండు లక్షల పెట్టుబడీ నువ్వే వుంచుకోవమ్మా" అని చెప్పేశాను.
===========================================
"ఈ టపా చదువుతున్న సింహరాశి సోదరసోదరీమణులు, బావమరిది మరదలాదులు, నిస్త్రాణ నిరాశ పడవలసిన అవసరం లేదు" అని నేనంటే, నేను మీ సగటు తెలుఁగు రాజకీయవెత్త కంటే దుష్టుడనైపోతాను. కాబట్టి నిస్త్రాణ నిరాశ పడదాం, కానీ అది ఉమ్మడిగా పడదాం. యద్భవిష్యులమై కూర్చోకుండా, మనం సింహరాశి అనానిమిషులు అని ఒక సపోర్టు గుంపు ఏర్పఱచుకుందాం.
ప్రతి శని వారం, అలానే ప్రతి నెలలోనూ మన అదృష్ట సంఖ్యలైన ౧, ౨, ౩, ౯ అలానే ౧౧, ౧౨, ౧౩, ౧౯, ౨౧, ౨౨, ౨౩, ౨౯, ౩౧ తేదీలలో కూడలి వారి కబుర్ల గదిలోఁ కలసి మన దగ్గరున్న వజ్రవైడూర్యకెంపులను పంచుకుందాం. మఱి నాలాంటి నిరుద్యోగులకు వజ్రం కొనుక్కోవాలంటే కష్టమేకదా. శని గురువులకు జపదానం చేద్దాం, వాళ్ళైనా పాపం ఇంటింటీకీ ఏం వెళతారు. మన రాశి లోకి శని అప్పుడప్పుడూ వచ్చి వెళ్తూంటాడు. కానీ పాపం శనిని శని ఎప్పుడూ పీడిస్తూనేవుంటుంది. అలానే నేను నలమహారాజు చరిత్ర కాపీ చేస్తాను మీరు పేస్టు చేసుకోండి.
మీరందఱూ నాకు తలో ఐదువేలు నగదు పంపండి, నేను మందపల్లి వెళ్ళి శనీశ్వర దేవాలయంలో శనిత్రయోదశినాడు మీ పేర్ల మీదఁ లక్షనామజపదానం చేయిస్తాను. సరేనా మఱి. అప్పటి వఱకూ ఈ బరాకేశ్వర మంత్రం గుర్తుపెట్టుకోండి.
ఈ రాశి వారికి గురుడు 30-7-09 వరకు షష్టస్థానమైన మకరమునందు తదుపరి సప్తమస్థానమైన కుంభరాశిలో లోహమూర్తిగాను, 30-7-09 నుండి 19-12-09 వరకు వక్రనడకతో షష్టమరాశియైన మకరరాశిలోను తదనంతరము సప్తమస్థానమైన సహింహరాశిలోనూ పిమ్మట ద్వితీయ రాశియైన కన్యరాశి యందు రజితమూర్తిగాను సంచారము. రాహువు 19-11-09 వరకు షష్టమస్థానమైన మకరరాశి యందు తదనంతరము పంచమస్థానమైన ధనస్సునందు లోహమూర్తి గాను, కేతువు 19-11-09 వరకు వ్యయస్థానమైన కర్కాటకరాశియందు, అనంతరం లాభస్థానమైన మిథునరాశి యందు లోహమూర్తి గాను సంచారము.
ఈ రాశివారికి ఏలినాటిశని ప్రభావము ప్రబలముగా వుంటుడ వలన, గురుని యెక్క బలము సామాన్యముగా యుండుట వలన ఈ సంవత్సరము ఇబ్బందికరముగా యుండును.
ఆర్థికముగా వెనుకబడుట, అనారోగ్యము, మానసికంగా బలహీనత, కోర్టువ్యవహారములలో చిక్కుకొనుట, ప్రమాదము ఏర్పడుట, నిస్త్రాణనిరాశలు, మిత్రులు శత్రువులగుట, స్థిరాస్తుల విక్రయము, ఋణములు చేయుట జరగే అవకాశములు గలవు.
వ్యపార రంగమలోని యీ రాశివారికి జాయింటు వ్యాపారము వలన నష్టపోవుట జరిగే అవకాశము గలదు. ఆర్థక లావాదేవీలతో సమస్యలు ఏర్పడును.
రాష్ట్ర కేంద్ర ప్రయివేటు రంగములలోని ఉద్యోగస్తులకు వత్తిడి ఎక్కవగుట, కొన్ని పరిస్థితులలో సస్పెండు అయ్యే అవకాశములున్నవి. కావున అతిజాక్రత్తగా మసలు కొనుట మంచిది.
విద్యార్థులకు మొదటి ఛాన్సులో కంటే రెండవ ఛాన్సులో చక్కని ఫలితం లభిస్తుంది.
రైతులకు పంటల దగుబడి తక్కువగా వచ్చును. తద్వారా ఆర్థిక పరమైన నష్టము కలుగును.
కాంట్రాక్టుదారులకు టెండర్లు కలసివచ్చనప్పటికీ, ప్రభుత్వపరమైన ఒత్తిడుల వలన కష్టనష్టముల పాలగుట జరుగును. ఫైనాన్సు వారికి లాభదాయకము.
వృత్తిపనివారలకు, టీవి మఱియు సినీకళాకారులకు శ్రమకు తగ్గ ఫలితం లభించదు.
ఆదాయము కంటే ఖర్చు తక్కువగా వున్నప్పటికి అప్పుడప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు కలుగును.
రాజకీయనాయకులైన యీ రాశివారికి తగినంత ప్రోత్సాహకరమైన కాలముకాదు.
ఈ రాశి స్త్రీలకు తమమాట చెల్లుబాటుకాదు. వ్యతిరేకత ఎక్కువ. చోరభయం, ఉదర సంబంధమగు వ్యాధులు, తలపోటు, జ్వరములు వచ్చుట సంభవించును.
అవివాహితులకు వివాహము జాప్యమగును.
ఈ రాశివారి అదృష్టసంఖ్య ౧. అనుకూల సంఖ్యులు ౨,౩,౯. రాశ్యాధిపతి రవి గావున కెంపు ధరించుట, మఖానక్షత్రమువారు వైఢూర్యము పుబ్బవారు వజ్రము ను ధరించుట మంచిది. ఈ రాశి వారు గురు శనులకు జపదానములు చేయుంటకొనుట, నలమహారాజు చరిత్ర పఠించుట మంచిది. నీలిరంగు పువ్వులు నల్లని వస్తువులు నువ్వులనూనె దానంగా ఇవ్వండి. ఎఱుపురంగు పూలమొక్కలను తూర్పుదిశలలో పెంచండి. శుభం జరుగుతుంది.
===========================================
"*&^) మ్యాన్, ఈ ఏఁడు బాగా *&^% పోయినట్టున్నాం" అనుకున్నాను. వీడు ఇంత సువివరంగా వ్రాయడం మానేసి, "ఈ ఏఁటికి ఈ రాశి వారి కర్మ గుడిసెటిది" అని క్లుప్తంగా వ్రాసివుంటే ఆయనకీ నాకూఁ కాస్త శ్రమ తగ్గేదిగా.
వ్యాపారం చేద్దామంటే నష్టపోతామంట. ఉద్యోగం చేయబోతే అది కాస్తా ఊడిపోతుందఁట. పోనీలే మళ్ళీ పైచదువులకు పోదామంటే, అవీ కుదరవఁట. రాజకీయం, వ్యాపారం, వ్యవసాయం కళారంగం అబ్బే ఎక్కడా లాభం లేదు. పోనీలే పెళ్ళి చేసుకుంటే పోతుంది అని అనుకుంటే, ఆ భాగ్యమూలేదు. పెపెచ్చు అనారోగ్యం కూడానఁట. కాబట్టి ఈ ఏఁడు కూడా ఇలా నిస్త్రాణ నిరాశలతో గడిపేయాలఁట. (నిస్త్రాణ nis-trāṇa. n. Weakness.).
పోనీలెండి, ఈయనెవరో ముందే చెప్పి మనల్ని మానసికంగా సిద్ధంగా వుంచాడు. ఇప్పుడు నాకు ఏంజరిగినా, "అఱె ఆ రోజు పలానా నామాని వారి పంచాంగంలో అచ్చం ఇలాంటిదే జరుగుతుందని వ్రాసారే" అనుకోవచ్చు. అలానే అడ్డమైన ప్రయత్నాలలో శ్రమ, డబ్బు ఖర్చు మానుకోవచ్చు. ఇంచక్కా కాళీగా కూర్చుని బ్లాగులు చదువుకోవచ్చు.
===========================================
ఏమిటి రాకేశ్, ఇంతా చదువుకొని నువ్వు కూడా ఇలాంటి మూడనమ్మకాలు పెట్టుకంటావా?
ఆఖరికి ఇంతకి దిగజారిపోయావా?
ఇవన్ని సోది మాటలు రాకేశ్, పొట్టగడుపుకోవడానికి వ్రాస్తారు, వాటిని నమ్మకూడదు.
అసలే స్టాటిస్టికల్ అనలిష్టువి, వెయ్యమందిలో ఒకఁడికి పది సార్లు టాసు వేస్తే వరుసగా పదిసార్లూ బొరుసే రావడం సహజం అని తెలిసినవాడివి. మానవకృషి యొక్క విలువ తెలియకపోవడమేమిటి?
ఇలాంటి మాటలు మీరు అంటూవుండవచ్చు.
అవును నిజమే, నేను చాలా చదువుకున్నాను. లెక్కల నుండి ఛందస్సు వఱకూ, ఆర్థిక శాస్త్రం నుండి మానసిక శాస్త్రం వఱకూ. ఆచార్యుని అద్వైతం దగ్గర నుండి ఐనిస్టీను రిలేటివిటీ వఱకూ చాలా విషయాలు చూచాయిగా పరిచయం కూడా వున్నాయి. ఏన్నో పరీక్షలు కష్టపడి వ్రాసాను, పలుదేశాల్లో పలు రంగాల్లో పనికూడా చేశాను.
నేనూ రెండేండ్ల క్రితం వఱకూ మీలాగానే ఆలోచించాను. తుస్ ఈ జాతకాల్లో ఏం లేదని. ఇదే ఏలినాటి శని గుఱించి మీరు నాకు రెండేళ్ళ క్రితం అనగా ౨౦౦౭ ఉగాదిలో చెప్పుంటే. "తుస్ శనీ లేడు గినీ లేడు, నా రాశిలో కొస్తేనేం, వెనుకభాగం మీద తంతే, వీధవతల పడతాడు" అనేవాడిని. అలా ౨౦౦౮ ఉగాదిలో చెబితే, "వెల్... అంటే... ఇలాంటివి నమ్మకూడదనుకో... కానీ చెప్పలేం.. ద యీనివర్స్ కెనోన్లీ బీ సో రేణ్డమ్ కదా... దానీకీ దీనికీ స్టాటిస్టికల్ కోరిలేషన్ వుండడం పెద్ద ఆశ్చర్యమేముంది. గత ఏఁడాది నేను అనుకున్నట్టుగా ఒక్కటీ జరగలేదు చూడండి. మా బామ్మ కూడా 'జాతకం బాలేదురా అందుకే అమెరికానుంచి వచ్చేసావు' అనంది" అని అనేవాడిని.
ఇక ఈ ఏటికి వచ్చేసరికి పంచాంగం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసాను. "శని ఎలా వున్నాడు, అతనికి అన్ని మర్యాదలూ జరుగుతున్నాయా, ఇంకెన్నాళ్ళుంటాడు మన రాశిలో" వంటివి తెలుసుకుందామని. వాళ్ళు "పర్వాలేదు, ఈ ఏఁడు బానేవుంటుంది" అనంటే నా పనులు నేను చూసుకుందామని, లేకుంటా - ప్రస్తుతం ఉన్నట్లుగా కాళీగానే వుందామని నిర్ణయించుకున్నాను.
మొన్నటి వఱకూ ఎవరైనా "వూళ్లోనేం చేస్తున్నావు? ఎప్పుడు వెళ్తున్నావు?" అనడిగితే మార్చనో మాఘమనో ఏదో చెప్పేవాడిని. ఇప్పుడేమో ఆ శ్రమంతా లేక "ఇక్కడే వుంటున్నా ఎక్కడికీ వెళ్ళట్లేదు" అని చెబుతున్నాను. ఇఁక మొన్నొకసారి ఒక హస్తజ్యోతిష్యుని దగ్గర చెయ్య చూపించుకుంటే, "అఱ్ఱె ఈపాటికే నువ్వు ఆసుపత్రిలోనుండాలే" అన్నాడు. "వెల్ డ్యూడ్ యు గాటే పాయింట్" అనుకున్నాను మనసులో. అలా ఆ డ్యూడ్ పాయింటుతో అప్పటికే బలంగానున్న నా నమ్మకం ఇంకా బలపడింది.
పోనీ లెండి నల్లమబ్బుకి తెల్లంచు అన్నట్టు. ఫైనాన్సులో వున్నవారికి లాభదాయకం అన్నాడు. కాబట్టి నేను ప్రస్తుతం చేస్తున్న డెరివేటివ్ ట్రేడింగ్ . కొనసాగిస్తే సరిపోతుందిదేమో. అసలే రెండు నెలలుగా లాభాలువస్తున్నాయి. అలలే ఇవాళ అచ్చంగా నా కోసమే అన్నట్టు నిఫ్టీ 3050 పైన ఆగింది. కాని నా స్నేహితురాలు తన తరఫున కూడా పెట్టుబడి పెట్టమంటుంది. "నా పంచాంగంలో జాయింటు వ్యాపారం వల్ల నష్టాలు వస్తాయనుంది, కాబట్టి నీ రెండు లక్షల పెట్టుబడీ నువ్వే వుంచుకోవమ్మా" అని చెప్పేశాను.
===========================================
"ఈ టపా చదువుతున్న సింహరాశి సోదరసోదరీమణులు, బావమరిది మరదలాదులు, నిస్త్రాణ నిరాశ పడవలసిన అవసరం లేదు" అని నేనంటే, నేను మీ సగటు తెలుఁగు రాజకీయవెత్త కంటే దుష్టుడనైపోతాను. కాబట్టి నిస్త్రాణ నిరాశ పడదాం, కానీ అది ఉమ్మడిగా పడదాం. యద్భవిష్యులమై కూర్చోకుండా, మనం సింహరాశి అనానిమిషులు అని ఒక సపోర్టు గుంపు ఏర్పఱచుకుందాం.
ప్రతి శని వారం, అలానే ప్రతి నెలలోనూ మన అదృష్ట సంఖ్యలైన ౧, ౨, ౩, ౯ అలానే ౧౧, ౧౨, ౧౩, ౧౯, ౨౧, ౨౨, ౨౩, ౨౯, ౩౧ తేదీలలో కూడలి వారి కబుర్ల గదిలోఁ కలసి మన దగ్గరున్న వజ్రవైడూర్యకెంపులను పంచుకుందాం. మఱి నాలాంటి నిరుద్యోగులకు వజ్రం కొనుక్కోవాలంటే కష్టమేకదా. శని గురువులకు జపదానం చేద్దాం, వాళ్ళైనా పాపం ఇంటింటీకీ ఏం వెళతారు. మన రాశి లోకి శని అప్పుడప్పుడూ వచ్చి వెళ్తూంటాడు. కానీ పాపం శనిని శని ఎప్పుడూ పీడిస్తూనేవుంటుంది. అలానే నేను నలమహారాజు చరిత్ర కాపీ చేస్తాను మీరు పేస్టు చేసుకోండి.
మీరందఱూ నాకు తలో ఐదువేలు నగదు పంపండి, నేను మందపల్లి వెళ్ళి శనీశ్వర దేవాలయంలో శనిత్రయోదశినాడు మీ పేర్ల మీదఁ లక్షనామజపదానం చేయిస్తాను. సరేనా మఱి. అప్పటి వఱకూ ఈ బరాకేశ్వర మంత్రం గుర్తుపెట్టుకోండి.
ఆ॥
కద్దు కటిక రాత్రి పొద్దు పొడుపు ముందు
ఇట్టు యీసు గోన గెట్టు వర్సు
బీఫొరిట్టు గెట్సు బెటరు! సో టేక్కేరు
విశ్వదాభిరామ వినుఁ బరాక!
Monday, March 23, 2009
ఇంసోమ్నియపు పద్యాలు
రోజూ రాత్రి పడుకునేముందు ప్రొద్దుటే ఆఱింటికి లేవాలి అనుకొని తొందరగా పడుకోవడం జరుగుతుంది. కానీ నిద్రపట్టిచావదు - వేడనో దోమలనో ఆలోచనలనో. అలా నిద్రకోసం వేచిచూస్తున్నంతసేపు, ప్రపంచ పరిస్థితిని బాగుచేయాలనే ఆలోచనల ఊబిలో పడకుండా కాపాడుకోవడానికి నిన్న రాత్రి రెండు వృత్తాలు వ్రాయఁబూనుకున్నాను. కాగితం కలం కంప్యూటరు కీబోర్డు లేకుండా బుఱ్ఱలోనిలా ..
చంపకమాలంటే నజభజజజర అని కాకుండా తననన తాన తాన తన తానన తానన తానతానతా అని గుర్తు పెట్టుకంటే మంచిదని విని అలా పట్టాను. కాబట్టి ఈ పద్యంలో పదాల విఱుపులు కూడా అలానే వస్తాయి.
కడుపా అయ్యది ఖండవల్లి మడుగా అన్నది శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారనే కవి వ్రాసిన "బొబ్బిలి యుద్ధం" నాటకం లోనిదఁట. ఖండవల్లి మడుగు ఇప్పుడో జాతీయంగా మారినా (ఖండవల్లిలోని ప్లాస్టిక్ చెత్తకి అది ఒక ముఱికి కూపంలా కూడా మాఱివుంటుంది లెండి అది వేఱే విషయం) ఆ మిగిలిన పద్యం ఎవరికీ తెలియదు. ఆ మత్తేభ విక్రీడితమెలా వుంటుందో నాకు తెలియదు గాని, ఇలావుంటుందేమో అన్నట్టుగా మీకోసం అచ్చమైన వాడుక తెలుఁగులో పూరించాను. ఆస్వాదించండి.
చం॥
కవితలు మాని యీ యువత కాసులె లెక్కలు వేసుకొంటిరే ।
అవతల పేదజీవితము లాకలి కేకలు పట్టవేవి । పై
స విలువ యైన లేని జలసాలకు బోతిరి నాగరీకులై ।
సుమిమల సౌమ్య సుందరతఁ జూడక పోతిరి కామచారులై ॥
చంపకమాలంటే నజభజజజర అని కాకుండా తననన తాన తాన తన తానన తానన తానతానతా అని గుర్తు పెట్టుకంటే మంచిదని విని అలా పట్టాను. కాబట్టి ఈ పద్యంలో పదాల విఱుపులు కూడా అలానే వస్తాయి.
మ॥
కడుపా? అయ్యది ఖండవల్లి మడుగా? కాజాలు, లడ్డూలు, మీ
గడ బొబ్బట్లును, పప్పుచారు, పెరుగూ, కారాల పచ్చళ్ళు, మా
మిడి పళ్ళేమిటి, పాయసాలిఁక యిలా మీరెంత వడ్డించినా
మిడతంభొట్ల గణేశు గాడికసలేమీ చాలదంటే నిజం॥
కడుపా అయ్యది ఖండవల్లి మడుగా అన్నది శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారనే కవి వ్రాసిన "బొబ్బిలి యుద్ధం" నాటకం లోనిదఁట. ఖండవల్లి మడుగు ఇప్పుడో జాతీయంగా మారినా (ఖండవల్లిలోని ప్లాస్టిక్ చెత్తకి అది ఒక ముఱికి కూపంలా కూడా మాఱివుంటుంది లెండి అది వేఱే విషయం) ఆ మిగిలిన పద్యం ఎవరికీ తెలియదు. ఆ మత్తేభ విక్రీడితమెలా వుంటుందో నాకు తెలియదు గాని, ఇలావుంటుందేమో అన్నట్టుగా మీకోసం అచ్చమైన వాడుక తెలుఁగులో పూరించాను. ఆస్వాదించండి.
Sunday, March 08, 2009
బృహన్ముంబయి - ౧వ భాగము
ప్యాంటులో పాసు పోస్తూ స్కూలు నుండి వీధిలోనికి పెరుగెడుతున్న ఆరేళ్ళ కుఱ్ఱాడిలా, కంగారు కంగారు గా బంబాయి వీధులలో పరుగెడుతున్న నీళ్ళ లారీ పై బృహన్ముంబయి మహానగర పాలికా, అని వ్రాసివుండడం చూస్తే మీకు మొదట అనిపించేదేఁవిటంటే,
బృహత్ + ముంబయి = బృహన్ముంబయి, అనునాసిక సంధి బాగుంది అని.
ఆ తరువాత అనిపించేది, బృహత్ అంటే గొప్ప, మహా అన్నా గొప్పే, నగర అంటే గొప్పూరు, పాలిక అంటే మళ్ళీ రాజసూచికం. ఏఁవిటి వీళ్ళ గురించి వీరు ఇంత టాం వేసుకుంటున్నారు అనిపిస్తుంది. కానీ రోజు గడిచేలోపు బృహద్బృహన్ముంబయి అతిమహానగరం అని మీకు రూఢీగా తెలియవస్తుంది.
ముంబయి నగరానికి వెళ్ళడం ఒక త్రీడి వెర్చుయల్ రియాలిటి సినిమా చూడండలాంటిది. ఈ సినిమాలో గొప్పదనం ఏంటంటే, సినిమాలో పాత్రలు మీతో సంభాషించడం. మీ చేయి పట్టుకున్ని మిమ్మల్ని సినిమాలోపల నడిపించడం. నాకు ముంబయిలో పని పడింది. దానికి రెండు రోజులు ముందు వెళ్లి , పని అయన ఒక రోజు తరువాత వెనక్కి వచ్చాను. నేను అక్కడవున్నన్నాళ్ళూ వర్షం పడుతూనేవుంది. ప్రపంచంలో చాలా తక్కువ చోట్ల అంత కసిగా అంత సుధీర్ఘకాలం వర్షం పడడం సహజంగా పరిగణించబడుతుంది. నగరంలో కంపు చూసి దాన్ని శుభ్రం చేయబూనిందేమో వర్షం అని మీకు అనుమానం కలుగవచ్చు. ఆ అనుమానం బహుసహజం. కానీ సహ్యాద్రులకు పశ్చిమ పక్క నివసించిన ఎవరికైనా, ఈ వర్షం ఈ ప్రాంతాలలో ఈ కాలంలో ఇలానే పుడుతుందని తెలుసు. కేరళలో రవి నేల కానలేని కారడవులనుండి, కొంకణి నిర్మానుష్య సముద్రాల మీద వాన పడడం కోసం మాత్రమే పడుతూవుంటుంది. పడుతూనేవుంటుంది.
అలాంటి ఒక వాన ఆదివారం నాడు, రెండు కోట్ల జనులపై దయలేకుండా నగరంపై విరుచుకు పడ్డ వానలో ఉదయాన్నే ఆరున్నరకి బయలుదేరా నగరం మీదకు, నగరం లోనికి. సరిగా గంటన్నరలో చాలా దూరం వెళ్ళాలి.
వెళ్లాను రైలుమందిరానికి. పూజారి గారి పలుకుకోసం పడిగాపులుగా పురజనులు ప్రక్రమాలు కట్టారు. అక్కడ నించుంటే గంటన్నర కాస్త గట్టెక్కేస్తుంది, దానితోఁ బాటు నా అరవై వేలు కూడా, వెంటనే ఆటో కోసం వెదకి, ఇంకో రైలు స్టేషను దగ్గర దింపమన్నా, ఎక్కడ నుండి నేను వెళ్ళాల్సిన చోటుకు రైళ్ళు దొరుకుతాయో అలాంటి స్టేషను ఇంకొకటి కడ దింపమన్నాను. అతను ఎక్కించుకొని, కొంత దూరంలో ఉన్న ఒక కూడలి దగ్గర వదలి. అదిగో అక్కడ నీకు కావలసిన బస్సు దొరుకుతుంది అని చెప్పి డబ్బు తీసుకొని తుఱ్ఱుమన్నాడు. అక్కడికి వెళ్ళి నించున్నాను. నలుగురునీ అడగసాగాను పలానా స్టేషనుకు బస్సు వస్తుందా అని.
సకుటుంబ సమేతంగా బస్సు కోసం వేచివున్న ఒకాయన మీరు ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు, కాందివిలి అని చెప్పాను. అరె మేమూ అక్కడికే. ఇక్కడనుండి నేఱుగా బస్సులు దొరుకుతాయి, ట్రెయిను అవసరం లేదు. అన్నాడాయన. మాతోఁ బాటు రండి బస్సులో వెళ్దాం అన్నాడు. సరే బస్సు ఎప్పుడు వస్తుంది ఎంత సేపు పడుతుంది అని అడిగాను. ఇప్పుడు వస్తే గంటన్నర పడుతుంది అన్నాడు. నాకు నా అరవై వేలూ, దానితోఁబాటూ ఎన్నో చదువుతూ గడిపిన అర్థరాత్రులూ గుర్తుకువచ్చాయి.
సరె బస్సురావడానికో అనడిగితే.. "మేము ఇక్కడే అరగంట నుండి చూస్తున్నాము రాలేదు. కాబట్టి ఎప్పుడైనా రావచ్చు". హూఁ... అవునా, నాకు పదేళ్ళగా లాటరీ తగలలేదు కాబట్టి ఇవాళ తగలవచ్చు అన్నట్టుగానుంది జవాబు. గత్యంతరం లేక నేను నా అరవై వేలూ ఆయన బుట్టలో పెట్టాను. ఆ సమయంలో నేను మార్కావ్ ప్రాసెస్ల గురించీ, ఎక్సుపోనెన్షియల్ డిసట్రిబ్యూషణ్ల గురించి ఆలోచించకుండా వుండడానికి ప్రయత్నించాను. ఆయనట్టుగానే యాండ్రే మార్కావ్ ని వెక్కిరిస్తున్నట్టుగా బస్సు వచ్చింది. నా కొత్త మిత్రులు పెట్టెలతోఁ బస్సువైపు పరుగెడుత్తడానికి పూనుకున్నారు. వారికి ఒక సమాను ఎక్కువయ్యేసరికి. భయిసాబ్ కాస్త ఈ పెట్టి మోసుకెళ్ళండి అని నాకు ఒక పెట్టి పారేసారు. మొత్తానికి బస్సు ఎక్కి కూర్చున్నా. కాళీగానే వుంది. గంటన్నర ప్రయాణమట, టికెట్టు మాత్రం పద్నాలుగు రూపాయిలే. బస్సు వెళుతూ వుంది. నేను ఏ పరివారంలో భాగమయ్యానో వారు నాకు అభయ-చూపులు ఇస్తూండడంతో లేని ధైర్యం తెచ్చుకొని కూర్చున్నాను. నా అఱవై వేల గురించి ఆలోచించకుండా వుండడానికి ప్రయత్నిస్తూ.
తడిచి ముద్దైన ముంబయి రోడ్ల మీద చక్రాలున్న పడవా యిది, లేదా నీట ప్రయాణించే బస్సా ఇది అన్నట్టుగా శర వేగంతో దూసుకుపోతుంది బస్సు. మధ్యలో నాకెందుకో నేను వెళ్ళాల్సిన చోటు నుండి కొంత దూరంగా వెళుతున్నానేమో అని అనుమానం కలిగింది. మా కొంగ్రొత్త ఇంటిపెద్దకి చూపించా నేను వెళ్ళవలసిన చిరునామా ఇది అని. ఆయన దాన్ని కొంత బాధగా చూసి, నువ్వు వెళ్ళాల్సింది కాందివిలి తూర్పు, మేము పడమర. మన దార్లు త్వరలోనే విడిపోతాయి, అని చెప్పాడు. పుంతలు విడిపోయిన చోట నేను దిగాను. మా పెద్దాయిన నన్ను ఎంతో బాధతో చూస్తూనే వీడ్కోలు చెప్పారు. గంటన్నర పాటూ ఒక కుటుంబంలో భాగమై, వాళ్లు దిగేటప్పుడు వాళ్ళ పెట్టెలు ఎవరు దించుతారో అన్న సంశయంతోనే నేను దిగి కిటికోలోనుండి వీడ్కోలు చెప్పి ఆటోకోసం వెదక సాగాను.
ఒకళిద్దరు ఆటోవాళ్లు నేను రానన్ననారు. మూడో ఆయన ఎక్కు అన్నాడు. కానీ అతని ముఖంలో 'నీ వ్యాధి తీవ్ర స్థాయికి చేరుకుంది, దాని గురించి ఏం చేయాలో ఆలోచిద్దాం' అంటున్నప్పడు ఒక ఆత్మవిశ్వాసం గల వైధ్యుని ముఖంలో కనిపించే చూపు అతని ముఖంలో నాకు కనిపించింది. ఆటో కొంత కాలం తోలాక తీఱికగా అన్నాడు. ఇప్పుడు భారీవర్షాలవలన అవతలకు (తూర్పుకు) వెళ్ళవలసిన సురంగ రోడ్డు నీట మునిగింది. కాబట్టి మనం ఒక పని చేద్దాం. నేను నిన్ను రైల్వేటేషను ఇవతల వదులు తాను. నువ్వు దాన్ని దాటి అవతలకు వెళ్ళు. ఆవతలి పక్క షేర్డు ఆటో నీ కోసం ఉంటుంది అన్నాడు. నాకు మళ్ళీ నా అరవై వేలు నా దగ్గర నుండి దూరంగా పోతున్నట్టు అనిపించింది.
కొంత సేపటికి అలానే ఒక స్టేషను ఇవతల వదిలాడు. అవతల కెళడానికి దారి అదిగో అటు అని చూపి. అటు పోయి చూడగా, చాలా మంది రైలు పట్టాల ప్రక్కన దాట కూడని గేటు క్రింద నుండి దాటి, అవతలి ప్రక్కకు వెళ్ళడం చేస్తున్నారు. నేనూ అదే పని చేయబోయేటప్పుడు సరిగ్గా రైలు వచ్చింది. హూఁ జపానులో మూకుమ్మడి ఆత్మహత్యలంటారు, ఇలానే వుంటాయేమో.. అనుకున్నాను.
చివరకు ఎప్పుడో నేననుకున్న రైల్వేష్టేషను యొక్క అనుకున్న ప్రక్కకు రావడంతో నా జీవితం నేను వేసిన ప్లానుకు అనుగుణంగా వచ్చి చేరింది. మన నిజ జీవితాలలో కూడా ఇంతే, మీరు ఇఱవైకి నేను చదువు చించి పారేశ్తా, పాతికకి పెళ్ళాడతా, ముప్పైకి మూడు కోట్లు పోగుజేస్తా, నలభైకి నలుగురు పిల్లల్ని కంటా అని లెక్కలేస్తారు గదా. కానీ నిజంగా అలా ససేమిరా జరగదు. మీరు ఎంత తక్కువ అంచనాలు వేసినా అవి అనుకున్నట్టు జరిగే ప్రసక్తి లేదు. మీరు అనుకోనట్టు మాత్రం జరుగుతుంటాయి, అంటే మీరు పాతికకు పెళ్ళి చేసుకుంటాననుకున్నారనుకోండి. అది పాతిక బదులు ముప్పై అవుతుంది. అలాగే నేను నలభైకి నలుగురు పిల్లల్ని కంటా ననుకున్నారనుకోండి, అది ముప్పైకే జరిగిపోవచ్చు. నాకూ అలానే జరిగింది, నేను పావుతక్కువ ఎనిమిదింటికి కాందివ్లి స్టేషను బయట (తూర్పు పక్క సుమీ) ఉంటానని లెక్క వేశానా, కానీ నేను అక్కడికి చేరుకునే సరికి ఎనిమిది అయ్యింది.
ఏఁవైతేనే అవతలి ప్రక్కకు చేరుకొని ఆటోకోసం చూస్తుంటే, నాలాంటి ఇంకో నలుగురు కుఱ్ఱాళ్ళు కనబడ్డారు.
కుఱ్ఱాళ్ళు అంటే ఒక మాట గుర్తుకువచ్చింది. ఇది అప్పుడు ఆ కుఱ్ఱాళ్ళని చూసినప్పుడు గుర్తుకురాలేదనుకోండి, కానీ ఇప్పుడిలా ఆ మాటని అక్షరాల్లో చూస్తుంటే నాకు గుర్తుకువచ్చింది, మా అమ్మ చిన్నప్పుడు, వాళ్ళ ఊళ్ళోకి పిఠాపురం నాగేశ్వరరావు గారు వచ్చారఁట. ఆయన కుఱ్ఱాళ్ళోయ్ కుఱ్ఱాళ్ళూ అన్న పాట పడారట. చాలా బాగా పాడరు అని ఇప్పటికీ చెబుతూంటుంది. నేను ఆ పాట వినక పోయిన, నాకు కూడా ఆ పాట అంటే ఇష్టం. ఇప్పుడు నాకు ఏఁవనిపిస్తుందంటే, నాకు ఆ పాట నచ్చడానికి గల కారణం కుఱ్ఱాళ్ళు అనే మాటలో వరుసా వచ్చే బండి ర క్రింద బండి ర దాని వెనకే వచ్చే అళ క్రింద అళ. వాటిని బండి ర, అళ అనడం మంచిది కాదనుకోండి. ఱ ని ఱ అనాలి గాని బండి ర అంటే ఏం బాగుంటుంది. చూడడానికి ఎంత బండిలా వుంటే మాత్రము. ఉదాహరణకు మీ పేరే అయినాపురం కోటీశ్వరరావు అనుకోండి. మీరు బండగా వుంటారనుకుందాం. మిమ్మల్ని ఎవరైనా బండ కోటి అంటే ఏం బాగుంటుంది. మీ వూళ్ళో వీదికో కోటీశ్వరరావు ఉన్నాడనుకోండి, అందులో ఇప్పటికే చాలా మందిని కోటి అనే అంటున్నారనుకోండి. అయినా మీమ్మల్ని బండ కోటి అనడం మిమ్మల్ని నొప్పిస్తుందిగా. అందుకే ఱని బండీ-ర అనకుండా ఱ అనాలి. ళని అళ అని ఎందుకనకూడదో చెప్పాలంటే, మీ పేరు సత్తుపల్లి సీతాలు అనుకోండి, మీవూళ్ళో ఇంకా చాలా మంది సీలాళ్ళు వున్నారనుకోండి, ఇంతమంది సత్తుపల్లి సీతాళ్ళున్న ఈ సచ్చుపల్లి సత్తుపల్లిలో ఎన్నాళ్ళుంటామనిఁ దలచి, మీరు కన్నడనాడు వలస వెళ్ళారనుకోండి. అక్కడ మిమ్మల్ని అందరూ సత్తుహళ్ళి సీతాళు అనిపిలుస్తున్నారనుకోండి. అది చాలా భావ్యమే అయినా - ఎందకంటే కన్నడవారికి ళ అంటే మమకారం ఎక్కువ, పైగా వారికిఁ ను, వు, ళు, గళు ప్రథమా విభక్తి - అయినా మీకు మనసు నొచ్చుతుంది కాదా. అందుకనే ళ ని అళ అనకూడదు. అలానే ఙకి తమిళ కథ, ఞకి మలయాళీ కథ వున్నాయి, అవి మరెప్పుడైనా చెప్పుకుందాం. అప్పటివఱకూ ఱ,ళ,ఙ,ఞ లను ర,ల,న,న లగా పలక రాదని బండ గుర్తు మాత్రం పెట్టుకోండి.
ఇంతకీ టేషనీకి అవతల ప్రక్క ఏఁవ్ జరిగిందో నేను చెప్పనేలేదు కదా. అవతల ప్రక్కకు వెళ్ళగానే అక్కడ కొందరు కుఱ్ఱాళ్ళు కనబడ్డారు. వారు కూడా పరీక్ష వ్రాయడానికి వచ్చిన వారల్లే వుంటే నేను వెళ్ళి అడిగాను ఫలానా కాలేజీకి వెళుతున్నారా అని. వారు వేంటనే అవునన్నారు. నలుగురం కలసి ఆటో వెదకబోయాం. చాలా ఆటోలు వున్నాయి గానీ ఎవరూ రామన్నారు. ఒకతను పాతిక ఇస్తే వస్తాను అన్నాడు. సరే అయితే రెండు ఆటోలు తీసుకుంటాం చెరో ఇద్దరూ అన్నాడితను. ఆటోవాడికి అలాగైతే వాడికి పజ్ఞెండు రూపాయలే చిక్కుతానుకున్నాడో ఏఁవోగాని వాడు మనాచేశాడు. ఇంతకీ ఇతని ఉద్ధేశం మాత్రం ఇద్దరికే పాతిక ఇస్తామని. అక్కడ అరవై వేలు గాలిలో వ్రేలాడుతూంటే, ఇక్కడ వీడు పాతికలకు బేరాలేఁవిటా అనుకొని వుంటాడతను.
తరువాత ఇంకొకతను నలుగురినీ ఎక్కుంచుకుంటా కానీ నలభై ఇవ్వాలి అన్నాడు. కాస్త ఎక్కువ అడుగుతున్నాడన్న సిగ్గు ముగంలే కనిపించేడట్టే. పాపం వానికేం తెలుసు ఎక్కువ అడగడం గుఱించి. మీ మనీ మేనేజర్ని పరిచయం చేయండి అతనికి కొంతైనా బుద్ధివస్తుంది, మీ మనీ మేనేజర్ కి కాదు, ఈ ఆటోవాడికి.
----------------------------------------------
నేను ముంబయి వెళ్ళింది 6, జూను, 2008
పై టపా వ్రాసింది 8, జూలై, 2008 (అప్పటికి ఇంకా పేళుళ్ళు వంటివి జరగలేదు).
కథ ఇంకా సగం బాకీ వుంది. కానీ అది ఎప్పటికి వ్రాస్తానో తెలియదు. వ్రాసిన అందులో ఎంత నాకు బాగా గుర్తుందో కూడా తెలియదు. కాబట్టి ప్రస్తుతానికి ఇది రాకేశ్వర-రావు-అముద్రితాలు లోనికి వెళ్ళిపోకుండా కపాడడానికి దీనిని ఇక్కడే ఇప్పుడే టపా చేస్తున్నాను. త్వరలో వీలైతే తఱువాయి భాగం ప్రచురిస్తాను.
బృహత్ + ముంబయి = బృహన్ముంబయి, అనునాసిక సంధి బాగుంది అని.
ఆ తరువాత అనిపించేది, బృహత్ అంటే గొప్ప, మహా అన్నా గొప్పే, నగర అంటే గొప్పూరు, పాలిక అంటే మళ్ళీ రాజసూచికం. ఏఁవిటి వీళ్ళ గురించి వీరు ఇంత టాం వేసుకుంటున్నారు అనిపిస్తుంది. కానీ రోజు గడిచేలోపు బృహద్బృహన్ముంబయి అతిమహానగరం అని మీకు రూఢీగా తెలియవస్తుంది.
ముంబయి నగరానికి వెళ్ళడం ఒక త్రీడి వెర్చుయల్ రియాలిటి సినిమా చూడండలాంటిది. ఈ సినిమాలో గొప్పదనం ఏంటంటే, సినిమాలో పాత్రలు మీతో సంభాషించడం. మీ చేయి పట్టుకున్ని మిమ్మల్ని సినిమాలోపల నడిపించడం. నాకు ముంబయిలో పని పడింది. దానికి రెండు రోజులు ముందు వెళ్లి , పని అయన ఒక రోజు తరువాత వెనక్కి వచ్చాను. నేను అక్కడవున్నన్నాళ్ళూ వర్షం పడుతూనేవుంది. ప్రపంచంలో చాలా తక్కువ చోట్ల అంత కసిగా అంత సుధీర్ఘకాలం వర్షం పడడం సహజంగా పరిగణించబడుతుంది. నగరంలో కంపు చూసి దాన్ని శుభ్రం చేయబూనిందేమో వర్షం అని మీకు అనుమానం కలుగవచ్చు. ఆ అనుమానం బహుసహజం. కానీ సహ్యాద్రులకు పశ్చిమ పక్క నివసించిన ఎవరికైనా, ఈ వర్షం ఈ ప్రాంతాలలో ఈ కాలంలో ఇలానే పుడుతుందని తెలుసు. కేరళలో రవి నేల కానలేని కారడవులనుండి, కొంకణి నిర్మానుష్య సముద్రాల మీద వాన పడడం కోసం మాత్రమే పడుతూవుంటుంది. పడుతూనేవుంటుంది.
అలాంటి ఒక వాన ఆదివారం నాడు, రెండు కోట్ల జనులపై దయలేకుండా నగరంపై విరుచుకు పడ్డ వానలో ఉదయాన్నే ఆరున్నరకి బయలుదేరా నగరం మీదకు, నగరం లోనికి. సరిగా గంటన్నరలో చాలా దూరం వెళ్ళాలి.
వెళ్లాను రైలుమందిరానికి. పూజారి గారి పలుకుకోసం పడిగాపులుగా పురజనులు ప్రక్రమాలు కట్టారు. అక్కడ నించుంటే గంటన్నర కాస్త గట్టెక్కేస్తుంది, దానితోఁ బాటు నా అరవై వేలు కూడా, వెంటనే ఆటో కోసం వెదకి, ఇంకో రైలు స్టేషను దగ్గర దింపమన్నా, ఎక్కడ నుండి నేను వెళ్ళాల్సిన చోటుకు రైళ్ళు దొరుకుతాయో అలాంటి స్టేషను ఇంకొకటి కడ దింపమన్నాను. అతను ఎక్కించుకొని, కొంత దూరంలో ఉన్న ఒక కూడలి దగ్గర వదలి. అదిగో అక్కడ నీకు కావలసిన బస్సు దొరుకుతుంది అని చెప్పి డబ్బు తీసుకొని తుఱ్ఱుమన్నాడు. అక్కడికి వెళ్ళి నించున్నాను. నలుగురునీ అడగసాగాను పలానా స్టేషనుకు బస్సు వస్తుందా అని.
సకుటుంబ సమేతంగా బస్సు కోసం వేచివున్న ఒకాయన మీరు ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు, కాందివిలి అని చెప్పాను. అరె మేమూ అక్కడికే. ఇక్కడనుండి నేఱుగా బస్సులు దొరుకుతాయి, ట్రెయిను అవసరం లేదు. అన్నాడాయన. మాతోఁ బాటు రండి బస్సులో వెళ్దాం అన్నాడు. సరే బస్సు ఎప్పుడు వస్తుంది ఎంత సేపు పడుతుంది అని అడిగాను. ఇప్పుడు వస్తే గంటన్నర పడుతుంది అన్నాడు. నాకు నా అరవై వేలూ, దానితోఁబాటూ ఎన్నో చదువుతూ గడిపిన అర్థరాత్రులూ గుర్తుకువచ్చాయి.
సరె బస్సురావడానికో అనడిగితే.. "మేము ఇక్కడే అరగంట నుండి చూస్తున్నాము రాలేదు. కాబట్టి ఎప్పుడైనా రావచ్చు". హూఁ... అవునా, నాకు పదేళ్ళగా లాటరీ తగలలేదు కాబట్టి ఇవాళ తగలవచ్చు అన్నట్టుగానుంది జవాబు. గత్యంతరం లేక నేను నా అరవై వేలూ ఆయన బుట్టలో పెట్టాను. ఆ సమయంలో నేను మార్కావ్ ప్రాసెస్ల గురించీ, ఎక్సుపోనెన్షియల్ డిసట్రిబ్యూషణ్ల గురించి ఆలోచించకుండా వుండడానికి ప్రయత్నించాను. ఆయనట్టుగానే యాండ్రే మార్కావ్ ని వెక్కిరిస్తున్నట్టుగా బస్సు వచ్చింది. నా కొత్త మిత్రులు పెట్టెలతోఁ బస్సువైపు పరుగెడుత్తడానికి పూనుకున్నారు. వారికి ఒక సమాను ఎక్కువయ్యేసరికి. భయిసాబ్ కాస్త ఈ పెట్టి మోసుకెళ్ళండి అని నాకు ఒక పెట్టి పారేసారు. మొత్తానికి బస్సు ఎక్కి కూర్చున్నా. కాళీగానే వుంది. గంటన్నర ప్రయాణమట, టికెట్టు మాత్రం పద్నాలుగు రూపాయిలే. బస్సు వెళుతూ వుంది. నేను ఏ పరివారంలో భాగమయ్యానో వారు నాకు అభయ-చూపులు ఇస్తూండడంతో లేని ధైర్యం తెచ్చుకొని కూర్చున్నాను. నా అఱవై వేల గురించి ఆలోచించకుండా వుండడానికి ప్రయత్నిస్తూ.
తడిచి ముద్దైన ముంబయి రోడ్ల మీద చక్రాలున్న పడవా యిది, లేదా నీట ప్రయాణించే బస్సా ఇది అన్నట్టుగా శర వేగంతో దూసుకుపోతుంది బస్సు. మధ్యలో నాకెందుకో నేను వెళ్ళాల్సిన చోటు నుండి కొంత దూరంగా వెళుతున్నానేమో అని అనుమానం కలిగింది. మా కొంగ్రొత్త ఇంటిపెద్దకి చూపించా నేను వెళ్ళవలసిన చిరునామా ఇది అని. ఆయన దాన్ని కొంత బాధగా చూసి, నువ్వు వెళ్ళాల్సింది కాందివిలి తూర్పు, మేము పడమర. మన దార్లు త్వరలోనే విడిపోతాయి, అని చెప్పాడు. పుంతలు విడిపోయిన చోట నేను దిగాను. మా పెద్దాయిన నన్ను ఎంతో బాధతో చూస్తూనే వీడ్కోలు చెప్పారు. గంటన్నర పాటూ ఒక కుటుంబంలో భాగమై, వాళ్లు దిగేటప్పుడు వాళ్ళ పెట్టెలు ఎవరు దించుతారో అన్న సంశయంతోనే నేను దిగి కిటికోలోనుండి వీడ్కోలు చెప్పి ఆటోకోసం వెదక సాగాను.
ఒకళిద్దరు ఆటోవాళ్లు నేను రానన్ననారు. మూడో ఆయన ఎక్కు అన్నాడు. కానీ అతని ముఖంలో 'నీ వ్యాధి తీవ్ర స్థాయికి చేరుకుంది, దాని గురించి ఏం చేయాలో ఆలోచిద్దాం' అంటున్నప్పడు ఒక ఆత్మవిశ్వాసం గల వైధ్యుని ముఖంలో కనిపించే చూపు అతని ముఖంలో నాకు కనిపించింది. ఆటో కొంత కాలం తోలాక తీఱికగా అన్నాడు. ఇప్పుడు భారీవర్షాలవలన అవతలకు (తూర్పుకు) వెళ్ళవలసిన సురంగ రోడ్డు నీట మునిగింది. కాబట్టి మనం ఒక పని చేద్దాం. నేను నిన్ను రైల్వేటేషను ఇవతల వదులు తాను. నువ్వు దాన్ని దాటి అవతలకు వెళ్ళు. ఆవతలి పక్క షేర్డు ఆటో నీ కోసం ఉంటుంది అన్నాడు. నాకు మళ్ళీ నా అరవై వేలు నా దగ్గర నుండి దూరంగా పోతున్నట్టు అనిపించింది.
కొంత సేపటికి అలానే ఒక స్టేషను ఇవతల వదిలాడు. అవతల కెళడానికి దారి అదిగో అటు అని చూపి. అటు పోయి చూడగా, చాలా మంది రైలు పట్టాల ప్రక్కన దాట కూడని గేటు క్రింద నుండి దాటి, అవతలి ప్రక్కకు వెళ్ళడం చేస్తున్నారు. నేనూ అదే పని చేయబోయేటప్పుడు సరిగ్గా రైలు వచ్చింది. హూఁ జపానులో మూకుమ్మడి ఆత్మహత్యలంటారు, ఇలానే వుంటాయేమో.. అనుకున్నాను.
చివరకు ఎప్పుడో నేననుకున్న రైల్వేష్టేషను యొక్క అనుకున్న ప్రక్కకు రావడంతో నా జీవితం నేను వేసిన ప్లానుకు అనుగుణంగా వచ్చి చేరింది. మన నిజ జీవితాలలో కూడా ఇంతే, మీరు ఇఱవైకి నేను చదువు చించి పారేశ్తా, పాతికకి పెళ్ళాడతా, ముప్పైకి మూడు కోట్లు పోగుజేస్తా, నలభైకి నలుగురు పిల్లల్ని కంటా అని లెక్కలేస్తారు గదా. కానీ నిజంగా అలా ససేమిరా జరగదు. మీరు ఎంత తక్కువ అంచనాలు వేసినా అవి అనుకున్నట్టు జరిగే ప్రసక్తి లేదు. మీరు అనుకోనట్టు మాత్రం జరుగుతుంటాయి, అంటే మీరు పాతికకు పెళ్ళి చేసుకుంటాననుకున్నారనుకోండి. అది పాతిక బదులు ముప్పై అవుతుంది. అలాగే నేను నలభైకి నలుగురు పిల్లల్ని కంటా ననుకున్నారనుకోండి, అది ముప్పైకే జరిగిపోవచ్చు. నాకూ అలానే జరిగింది, నేను పావుతక్కువ ఎనిమిదింటికి కాందివ్లి స్టేషను బయట (తూర్పు పక్క సుమీ) ఉంటానని లెక్క వేశానా, కానీ నేను అక్కడికి చేరుకునే సరికి ఎనిమిది అయ్యింది.
ఏఁవైతేనే అవతలి ప్రక్కకు చేరుకొని ఆటోకోసం చూస్తుంటే, నాలాంటి ఇంకో నలుగురు కుఱ్ఱాళ్ళు కనబడ్డారు.
కుఱ్ఱాళ్ళు అంటే ఒక మాట గుర్తుకువచ్చింది. ఇది అప్పుడు ఆ కుఱ్ఱాళ్ళని చూసినప్పుడు గుర్తుకురాలేదనుకోండి, కానీ ఇప్పుడిలా ఆ మాటని అక్షరాల్లో చూస్తుంటే నాకు గుర్తుకువచ్చింది, మా అమ్మ చిన్నప్పుడు, వాళ్ళ ఊళ్ళోకి పిఠాపురం నాగేశ్వరరావు గారు వచ్చారఁట. ఆయన కుఱ్ఱాళ్ళోయ్ కుఱ్ఱాళ్ళూ అన్న పాట పడారట. చాలా బాగా పాడరు అని ఇప్పటికీ చెబుతూంటుంది. నేను ఆ పాట వినక పోయిన, నాకు కూడా ఆ పాట అంటే ఇష్టం. ఇప్పుడు నాకు ఏఁవనిపిస్తుందంటే, నాకు ఆ పాట నచ్చడానికి గల కారణం కుఱ్ఱాళ్ళు అనే మాటలో వరుసా వచ్చే బండి ర క్రింద బండి ర దాని వెనకే వచ్చే అళ క్రింద అళ. వాటిని బండి ర, అళ అనడం మంచిది కాదనుకోండి. ఱ ని ఱ అనాలి గాని బండి ర అంటే ఏం బాగుంటుంది. చూడడానికి ఎంత బండిలా వుంటే మాత్రము. ఉదాహరణకు మీ పేరే అయినాపురం కోటీశ్వరరావు అనుకోండి. మీరు బండగా వుంటారనుకుందాం. మిమ్మల్ని ఎవరైనా బండ కోటి అంటే ఏం బాగుంటుంది. మీ వూళ్ళో వీదికో కోటీశ్వరరావు ఉన్నాడనుకోండి, అందులో ఇప్పటికే చాలా మందిని కోటి అనే అంటున్నారనుకోండి. అయినా మీమ్మల్ని బండ కోటి అనడం మిమ్మల్ని నొప్పిస్తుందిగా. అందుకే ఱని బండీ-ర అనకుండా ఱ అనాలి. ళని అళ అని ఎందుకనకూడదో చెప్పాలంటే, మీ పేరు సత్తుపల్లి సీతాలు అనుకోండి, మీవూళ్ళో ఇంకా చాలా మంది సీలాళ్ళు వున్నారనుకోండి, ఇంతమంది సత్తుపల్లి సీతాళ్ళున్న ఈ సచ్చుపల్లి సత్తుపల్లిలో ఎన్నాళ్ళుంటామనిఁ దలచి, మీరు కన్నడనాడు వలస వెళ్ళారనుకోండి. అక్కడ మిమ్మల్ని అందరూ సత్తుహళ్ళి సీతాళు అనిపిలుస్తున్నారనుకోండి. అది చాలా భావ్యమే అయినా - ఎందకంటే కన్నడవారికి ళ అంటే మమకారం ఎక్కువ, పైగా వారికిఁ ను, వు, ళు, గళు ప్రథమా విభక్తి - అయినా మీకు మనసు నొచ్చుతుంది కాదా. అందుకనే ళ ని అళ అనకూడదు. అలానే ఙకి తమిళ కథ, ఞకి మలయాళీ కథ వున్నాయి, అవి మరెప్పుడైనా చెప్పుకుందాం. అప్పటివఱకూ ఱ,ళ,ఙ,ఞ లను ర,ల,న,న లగా పలక రాదని బండ గుర్తు మాత్రం పెట్టుకోండి.
ఇంతకీ టేషనీకి అవతల ప్రక్క ఏఁవ్ జరిగిందో నేను చెప్పనేలేదు కదా. అవతల ప్రక్కకు వెళ్ళగానే అక్కడ కొందరు కుఱ్ఱాళ్ళు కనబడ్డారు. వారు కూడా పరీక్ష వ్రాయడానికి వచ్చిన వారల్లే వుంటే నేను వెళ్ళి అడిగాను ఫలానా కాలేజీకి వెళుతున్నారా అని. వారు వేంటనే అవునన్నారు. నలుగురం కలసి ఆటో వెదకబోయాం. చాలా ఆటోలు వున్నాయి గానీ ఎవరూ రామన్నారు. ఒకతను పాతిక ఇస్తే వస్తాను అన్నాడు. సరే అయితే రెండు ఆటోలు తీసుకుంటాం చెరో ఇద్దరూ అన్నాడితను. ఆటోవాడికి అలాగైతే వాడికి పజ్ఞెండు రూపాయలే చిక్కుతానుకున్నాడో ఏఁవోగాని వాడు మనాచేశాడు. ఇంతకీ ఇతని ఉద్ధేశం మాత్రం ఇద్దరికే పాతిక ఇస్తామని. అక్కడ అరవై వేలు గాలిలో వ్రేలాడుతూంటే, ఇక్కడ వీడు పాతికలకు బేరాలేఁవిటా అనుకొని వుంటాడతను.
తరువాత ఇంకొకతను నలుగురినీ ఎక్కుంచుకుంటా కానీ నలభై ఇవ్వాలి అన్నాడు. కాస్త ఎక్కువ అడుగుతున్నాడన్న సిగ్గు ముగంలే కనిపించేడట్టే. పాపం వానికేం తెలుసు ఎక్కువ అడగడం గుఱించి. మీ మనీ మేనేజర్ని పరిచయం చేయండి అతనికి కొంతైనా బుద్ధివస్తుంది, మీ మనీ మేనేజర్ కి కాదు, ఈ ఆటోవాడికి.
----------------------------------------------
నేను ముంబయి వెళ్ళింది 6, జూను, 2008
పై టపా వ్రాసింది 8, జూలై, 2008 (అప్పటికి ఇంకా పేళుళ్ళు వంటివి జరగలేదు).
కథ ఇంకా సగం బాకీ వుంది. కానీ అది ఎప్పటికి వ్రాస్తానో తెలియదు. వ్రాసిన అందులో ఎంత నాకు బాగా గుర్తుందో కూడా తెలియదు. కాబట్టి ప్రస్తుతానికి ఇది రాకేశ్వర-రావు-అముద్రితాలు లోనికి వెళ్ళిపోకుండా కపాడడానికి దీనిని ఇక్కడే ఇప్పుడే టపా చేస్తున్నాను. త్వరలో వీలైతే తఱువాయి భాగం ప్రచురిస్తాను.
Subscribe to:
Posts (Atom)
