భాషందం, భువనందం, బ్రతుకందం

Saturday, April 10, 2010

అమ్మమ్మ కబుర్లు ౨ - భారతమంతా బొంకూ రామయణమంతా రంకూను

"ఎరా విదురుడంటే ఎవర్రా? "
- "దృతరాష్ట్రుని తమ్ముడే।"
"దాసీకొడుకేనా? "
- "అవును।"
"అదే మహర్షి వచ్చినప్పుడు పెద్దదేమో కళ్ళు మూసుకుంటుంది। అప్పుడు దాసీకి పుట్టినోడేనా?"
- "ఊఁ"
"ఇప్పుడు వ్యాసుడికి ఏమవుతాడు "
- "మహర్షి వ్యాసుడేకద। "
"ఊహూఁ। నేను శంతన మహారాజు కథ చదివాను। "
- "శంతన మహారాజుకి ఇద్దరు కొడుకులుకదా సత్యవతి కడుపున। "
"చిత్రవిచిత్రులు"
- "అవును, మరి వాళ్ళిద్దరూ చచ్చిపోతారుగా। అప్పుడు వ్యాసమహర్షి గర్భదానం చేయడానికి పిలుస్తారు। అన్నగారి వరస అవుతాడుగా।"
"అదేంట్రా, శంతన మహారాజుకిద్దరు కొడుకులుగా। "
- "కానీ శంతన మహారాజు భార్య సత్యవతీ దేవికి పెళ్ళికాకముందే పిల్లవాడుంటాడే। "
"పెళ్ళి కాకుండా ఎలాగురా"
- "అదే చెబుతున్నానుగా విను। ఒక రోజు సత్యవతీ దేవి అంటే .."
"అదే పడవనడుపుకునేది। "
- "అవును ఆవిడ పడవమీద జనాల్ని నదికి అవతల దాటవేస్తుందిగా, మహా అందగత్తె అన్నమట, అక్కడికి ఒకరోజు ఒక ముని వస్తాడు।"
"అవును అదే శంతన మహారాజు కథలో నేను చదివాను, శంతన మహారాజు గంగాదేవిని పెళ్ళి చేసుకుని ప్రశ్నలేమీ అడకూడదంటుందికదా। అప్పుడేమో..."
- "ఇదంతా దాని ముందే। పరాశరముని వుంటాడు।"
"అదే నేను శంతన మహారాజు"
- "చెబుతావా వింటావా?"
"చెప్పు"
- "శంతన మహారాజు సత్యవతీదేవిని కలవక ముందురే , భారతం మొదట్లో, పరాశర ముని సత్యవతీదేవి వుండే రేవు కాడకు వస్తాడు, మన కొవ్వూరి రేవులాగ। ఆవిడేమో పడవదాటేస్తుంటుంది ఇతనిని। మధ్యలో మునికి ఆమెను చూసి కోఱిక కలుగుతుంది। మధ్యలో ఒక దీవిలో పడవ ఆపిస్తాడు, గోదారి మధ్యలో దీవులుంటాయిగా, అక్కడ వాళ్ళు ఏదోచేసుకుంటారు। "
"ఊఁహూఁ"
- "అదే మఱి నాకు పెళ్ళి కాలేదుగా, వాళ్ళ అక్కడ ఏం చేశారో నాకెలా తెలుస్తుంది, నీ పెళ్ళి ఎప్పుడో స్వతంత్రంరాక ముందు అయ్యిందిగా నీకే తెలియాలిలే। "
"ఊఁ నీకు తెలియదంటే నమ్మాలి। దేశాలన్నీ తిఱిగివచ్చావు కదరా ఇంచక్కా।"
- "అలా అక్కడ ఆ ద్వీపం మీద అప్పటికప్పుడే వాళ్ళకు పిల్లాడు పుడతాడు। అందుకే ఆయనకు ద్వీపం మీద పుట్టాడు పైగా నల్లగావుంటాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు, ఇంకా బాదరాయణుడు, పరాశరుని కొడుకు కాబట్టి పారాశరుడు అని పేర్లువున్నాయి వ్యాసమహర్షికి।"
"అయితే శంతన మహారాజు కలిసిందెప్పుడు? "
- "నువ్వూనూ మీ శంతన మహారాజూనూ। విను। అప్పుడేమో ఆవిడ ఇలా కన్యను నా కన్యత్వం పోగొట్టారు మహర్షీ అంటే, పరాశరుడు, ఏదో మాయచేసో మంత్రం వేసో, ఆమె కన్యత్వాన్ని వెన్నక్కి ఇచ్చేస్తాడు। అది కూడా నీకే తెలియాలి। అవన్నీ। "
"ఊఁ"
- "ఆ పిల్లాణ్ణోమో ఆవిడి చిన్నప్పుడే ఋషులదగ్గరకు పంపించేస్తుంది, ఆయన వ్యాసముని అవుతాడు। మీ శంతన మహారాజు వచ్చేసరికి మళ్ళీ సిద్ధంగా వుంటుంది ఈమె। "
"ఓహో"
- "శంతన మహారాజుని పెళ్ళిచేసుకున్నాక, చిత్రవిచిత్రులు పుడతారుగా। "
"అవును"
- "వాళ్ళిద్దరూ చచ్చిపోతారుగా పిల్లలు పుట్టకుండా। అప్పుడు వాళ్ళకి అన్నవరసయ్యేవారు వీర్యదానం చెయ్యాలన్నమట పెళ్ళాలకి। "
"ఆన్? "
- "అదే మరి భీష్ముడు మొగుళ్ళకు అన్నగారు కదా, అంటే బావగారి వరస కదా? "
"అయితే, ఛిఛీ మఱీ అదేంటిరా, ఎంత మొగుడు చచ్చిపోతే మాత్రం। బావగారితోనేంటిరా"
- "అదే రాజులకు వంశం ఆగిపోకుండా అన్నగారు వీర్యదానం చెయ్యవచ్చన్నమట।"
"అందుకేనేమో జనాలంటారు భారతమంతా బొంకూ రామాయణమంతా రంకూ అని। "
- "అదేనే మఱి క్షత్రియులు కదా, రాజులు లేకపోతే రాజ్యం ఏమయిపోతుందే, అందుకే వాళ్ళ అలాచేయవచ్చని అప్పటిలో నియమం వుంది।" (ఇంత అలౌకివాదం నేను జనమలోనెప్పుడూ గుప్పించలేదు) " ఇంతకీ ఏమంటారూ జనాలూ? "
"రామాణమంతా రంకూ భారతమంతా బొంకూ అంటారు। అదే మఱి సీతాదేవిని ఎత్తుకెళ్ళి అన్నాళ్ళు అక్కడవుంచుకున్నాక అప్పుడు వెనక్కి తీకుకొచ్చాడగా రాముఁడు। అదే జనాలకు తెలియక అలా అంటారులే। "
- "అవునా, బానేవుంది। మొత్తానికలా వంశవృద్ధికోసం వీర్యదానానికి భీష్ముణ్ణి అడుగుతారు। కానీ అయనేమో భీష్మప్రతిజ్ఞ చేస్తాడుగా నా వారసులు రాజ్యమేలరని। సత్యవతీదేవి వారసులే ఏలతారని। వీళ్ళు సత్యవతీదేవి వారసులయిననా ఈయన వారసులు కూడా అవ్వకూడదని అయన ససేమిరా వల్లకాదంటారు। అప్పుడేమో ఆవిడ ఇలా నా పెళ్ళికాకముందు ఇలా జరిగింది కథ అనిచెబితే వ్యాసుణ్ణి పిలుస్తారన్నమట।"
"ఆయనేమో భయం కరంగా వుంటాడంట కదరా"
- "అవును, అందుకే పెద్దది అంబా అంబాలికా దానిపేరు అది కళ్ళు మూసుకుంటుంది"
"ఒకత్తేమో తెల్లమోతుంది కావోల్సు అందుకే దానికి తెల్లగా పాండురాజు పుడతాడు"
- "రెండోదేమో తెల్లబోయి చమట్లు కక్కేస్తే దానికి పాండురాజు పుడతాడు। "
"అప్పుడు దాసీని పంపిస్తారనుకుంట।"
- "మఱి పెద్దోడు గుడ్డోడు, రెండోవోడు పాండుజబ్బువుందికాబట్టి, పెద్దదానికి నచ్చజెప్పి మళ్ళీ పంపుతారు। అదేమో భయపడిపోయి దాసిని పంపిస్తుంది। దాసేమో మహర్షి నా అదృష్టం ఈయనకు సేవచేయడం అని చెప్పి..."
"అదేమో మహర్షిని మంచి చేసుకుంటే విదురుడు పుడతాడన్నమట, కానీ రాజు అవ్వడుగా। "
- "ఆ దాసేమో మహర్షికి సకల సేవలూ చేసి సంతోష పెడితే, ఆయన విదురుణ్ణి కలుగఁజేస్తాడు, కానీ మఱి దాసి కొడుకు కాబట్టి రాజుకాలేడు। అదన్న మట కథ। ఇప్పుడేమో ఆరణ్య పర్వంలో దృతరాష్ట్రుడు వాడి మీద కోపం వచ్చి అడవికి పంపేశాడు ధర్మరాజుదగ్గరకు। ఊఁ చూడు చెబుతున్నారు।"

7 comments:

  1. miru enduku edi rayalsi vachchindo naku artham kaledu.ramayana,bhartalu mana bhartiya jivananiki punadulu.mana punadulu maname kadilinchukovatam yenthavaraku manchidi.mana bhavishyat taralaku manamu andinchakalige vignanam idi ,vatini vimarsinchatam mana astitwanni maname prasninchukovadam.anavasaram ga miru mi bhavalato pakka varini kudaa polute cheyyadu.
    rajeswari.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. బాగుంది మీ అమ్మమ్మగారితో పురాణకాలక్షేపం..

    ReplyDelete
  4. కొంచెం ఎబ్బెట్టుగా అనిపించినా మీరు రాసిందంతా మన పురాణాలలో ఉన్నదే. అప్పట్లో ఉన్న ధర్మం బట్టి ఆ పురాణాలలో అలా ఉంది. అప్పటి ధర్మాన్ని ఇప్పటి ధర్మానికి అన్వయించుకుని అదంతా తప్పు అనుకోవడం సరి కాదేమోనని నా అభిప్రాయం. మీరు రాసిన టపా లో నిజాలే ఉన్నాయ్ తప్ప ఎక్కడా మీ స్వంత అభిప్రాయాలు నాకు కనపడలేదు. దానికి స్టుపిడ్ పోస్ట్... వర్స్ట్ పోస్ట్ అని మిమ్మల్ని నిందించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను.

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం